|
|
Articles: My Thoughts | పత్రికల పుట్టుక-పరిణామం - Site Administrator
| |
1921లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 'స్వరాజ్య' మనే పత్రికను తెలుగు, తమిళ, ఇంగ్లీషు భాషలలో మద్రాసు నుండి నడిపి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పత్రికాపోరాటం జరిపి అనేకమార్లు ధరావతు కోల్పోయారు. 1991 లో మద్రాసు నుండి గాడిచర్ల 'ది నేషనలిస్టు' అనే పత్రికను 3 సంవత్సరాల పాటు నడిపారు. ఇందులో 'కిల్డ్ ఆఫ్ ది బుల్లెట్' అనే సంపాదకీయానికి ఆగ్రహించి బ్రిటీషు ప్రభుత్వం 2000 రూపాయల ధరావతు స్వాధీనం చేసుకొంది. 1922లో తాడిపత్రి నుండి గాడిచర్ల సంపాదకీయంతో వెలువడ్డ 'మాతృసేవ' పత్రిక జాతీయవాద ప్రచారానికి ఎంతగానో ఉపయోగపడింది. 1922 సంవత్సరంలోనే రాజమండ్రి నుండి మద్దూరి అన్నపూర్ణయ్య గారు, 'కాంగ్రెస్' పత్రికను ఏలూరు నుండి ఆత్మకూరి గోవిందాచార్యులు 'సత్యాగ్రాహి' అనే పత్రికను నడిపారు. మున్నంగి శర్మగారి సంపాదకత్వంలో 'గాండీవము', 'దేవదత్తము' అనే పత్రికలు ఏలూరు నుండి, ఎన్ గణేషన్ గారి సంపాదకత్వంతో మద్రాసు నుండి 'జన్మభూమి' పత్రిక జాతీయ పోరాటంలో తమవంతు కృషిని అందించాయి. జన్మభూమి ఖరీదు 'కాని'. అదే పేరుతో కానీ పత్రికగా ప్రఖ్యాతి గాంచింది. 1928 లో నెల్లూరు నుండి వెంకట్రామనాయుడు 'జమీన్ రైలు' అనే పత్రికను 1922లో తాడిపత్రి నుండి 'మాతృసేవ', అనంతపురం నుండి 'హాస్యమంజూష', నంద్యాల నుండి 'పినాకిని', 'కౌముదిని' అనే పత్రికలను, కడప నుండి అవధానం కృష్ణముని గారు 'బ్రహ్మనందిని' అనే పత్రికను నడిపి రాయలసీమ ప్రాంతం నుండి జాతీయోద్యమంలో తమవంతును పూర్తి చేసుకున్నారు.
నైజాం పాలనలో ఉన్న తెలంగాణలో చాలాకాలం పత్రికలు తలెత్తలేదు. 1913లో శ్రీనివాసశర్మగారు మహబూబ్ నగర్ నుండి 'హితబోధిని' అనే మాసపత్రికను 1920 లో వరంగల్ జిల్లా ఇంగుర్తి నుండి 'తెలుగు పత్రిక'ను, ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాయవ రంగారావుగార్లు ప్రారంభించారు. 1920 లో నల్లగొండ నుండి నీలగిరి అనే పత్రిక 5 సంవత్సరాల పాటు నడిచింది. 1925లో ప్రారంభమైన సురవరం ప్రతాపరెడ్డి 'గోల్కొండ' పత్రిక తెలంగాణ పత్రికారంగ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించింది. ఇది మొదట ద్వైవారపత్రికగా కొనసాగి తర్వాత దినపత్రికగా మారి, తెలుగు భాషావృద్ధికి, ఆంధ్రమహాసభ ఉద్యమానికి తోడ్పడింది. 1927 లో పిఎన్ శర్మ 'సుజాత' అనే మాసపత్రికను సురవరం మాడపాటి వంటి వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. 1933-38 మధ్యకాలంలో 'దేశబంధు', 'దక్కన్ కేసరి', 'ఆంధ్రవాణి', 'తెలుగుతల్లి', 'విభూతి' వంటి పత్రికలు ఈ ప్రాంతంలో వెలువడ్డాయి. 1945 లో జమీన్ అనే అరబ్బీ పేరుతో వెలువడ్డ తెలుగు పత్రిక అడవి బాపిరాజు సంపాదకత్వంతో వెలువడింది. 1917లో దేవులపల్లి రామానుజరావు గారు 'శోభ' అనే సారస్వత పత్రికను నడిపారు. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ వారి 'ప్రజాశక్తి' విజయవాడ నుండి నిజాం వ్యతిరేక తెలంగాణ రైతాంగ విప్లవ పోరాటాన్ని ప్రచురించింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|