|
|
Articles: TP Features | మన భాషను ప్రేమిద్దాం - Site Administrator
| |
ప్రజాస్వామ్యం గురించి ప్రతిక్షణం మాట్లాడే మనం ముందు భాష విషయంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, శక్తివంతం చేయాలి. గిడుగు, తాపీ ధర్మారావు, కందుకూరి, గురజాడ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీశ్రీ వంటి మహానుభావుల స్ఫూర్తిని మనం అందిపుచ్చుకోవాలంటే, మన జనాన్ని వారి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక ప్రాంతీయ భేదాలకు, స్థాయికి అతీతంగా ప్రేమించడం నేర్చుకోవాలి. అప్పుడే వారి భాషను మనం ప్రేమించగలుగుతాం. పరస్పరం ప్రేమాభిమానాలను, జాతిభావనను పెంపొందించకుండా, మనం భాషోద్ధారకులం కాలేం. తెలుగు భాషోద్యమాలకు గాని, తెలుగుజాతి పునరుజ్జీవన ఉద్యమాలకు గాని ఇదే ప్రాణావసరం.
ప్రజల భాషకు కిరీటం పెట్టడానికి ఎంతో కృషి చేసిన ముగ్గురు మహానుభావులు ఆగస్టు, సెప్టెంబరులలో జన్మించారు. ఆగస్టు 29న గిడుగు జయంతి తెలుగుభాషా దినోత్సవంగా చాలా చోట్ల జరిగింది. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి తెలుగు మాండలిక భాషాదినోత్సవంగా అయిదేళ్ళ నుండి అక్కడకడక్కడా జరుగుతోంది. సెప్టెంబర్ 19న తాపీధర్మారావు జయంతి. తాపీ వారి జయంతిని 'తెలుగు జన మాధ్యమాల దినోత్సవం'గా జరుపుకొంటే బాగుంటుందని రచయిత, పాత్రికేయుడు నాగసూరి వేణుగోపాల్ మూడేళ్ళ క్రితం ఒక వ్యాసంలో సూచించారు. గిడుగుకు శిష్యుడు, నార్లకు గురువూ అయిన తాపీ ధర్మారావు పత్రికా భాషను, సినీ సాహిత్యాన్ని జనానికి దగ్గరగా తెచ్చిన ప్రముఖుడు. ఈ సూచనను అందరూ సమర్థించి తాపీ ధర్మారావు జయంతిని 'తెలుగు జన మాధ్యమాల దినోత్సవం'గా నిర్వహించడం తెలుగు భాషోద్యమానికి శక్తినిస్తుంది. భాషోద్యమ కార్యకర్తలు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|