|
|
Articles: TP Features | రాజ్యాంగానికి షష్టిపూర్తి - Site Administrator
| |
నేరాలకు సంబంధించిన న్యాయవ్యవస్థ కుప్పకూలే పరిస్థితిలో ఉందని గమనించింది. సాక్షులకు రక్షణ లేదు. సరైన నేరపరిశోధన, విచారణ వ్యవస్థా లేదు. న్యాయవాదులకు, న్యాయమూర్తులకు తరచూ చట్టాల మీద అవగాహన కల్గించే చర్యలు తీసుకోవాలి. పట్టణాలలో వ్యాజ్యాల పరిష్కారానికి సామరస్యంగా పరిష్కరించే పద్ధతుల్ని వినియోగించాలి.
ప్రాథమిక విద్యలో 96.4శాతం జీతభత్యాలకే సరిపోతోంది. ఈ ప్రభావం 40 శాతం మంది ఉన్న 14 ఏళ్ళ లోపు విద్యార్థులపై పడుతుంది. ప్రజారోగ్య చర్యలపై దృష్టి పెట్టాలి.
ఈ నివేదిక ఇచ్చి దాదాపు ఎనిమిది సంవత్సరాలౌతోంది. ప్రభుత్వాలు మారాయి. నివేదికలో ఇచ్చిన సూచనలపై ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకోలేదు. తాత్కాలిక ఉపశమన చర్యలు మాత్రమే తీసుకొంటున్నారు. కమిటీని వేసిన రాజకీయ పక్షం అధికారం మారింది కాబట్టి కమిటీ నివేదిక కూడా బుట్టదాఖలా అయింది. అదే విధంగా సర్కారియా కమిషన్ సూచనలు కూడా అమలుకు నోచుకోలేదు. రాజ్యాంగానికి సంబంధించిన విషయాల్లో అన్ని రాజకీయ పక్షాలు కూడబలుక్కొని ఒక నిర్ణయానికి రావాలే కాని రాజకీయాలు ఉండకూడదు. కష్టపడి రానున్న తరానికి మంచి వారసత్వం అందించాలన్న ధోరణి నుండి మన రోజులు గడిస్తే చాలన్న ధోరణి గల వ్యవస్థలున్న రోజుల్లో ఉన్నాం ప్రస్తుతం.
మన రాజ్యాంగ వ్యవస్థలో స్పష్టంగా కనిపించని అతి ప్రధాన ప్రజాస్వామిక అంగం పత్రికారంగం. దృశ్య, శ్రవణ ప్రసార సాధనాలు కూడా ఈ రంగంలోకి వస్తాయి. చట్టపరంగా నియంత్రణ పెద్దగా లేని బాధ్యతాయుతమైన వ్యవస్థ ఇది. నడిపించేవాళ్ళకి, నడిపిస్తున్న వాళ్ళకీ తేడా లేకుండా పోయిన రోజుల్లో ఉన్నాం మనం. వృత్తికి వ్యాపారానికి స్నేహం ఎక్కువైనందువల్ల ఏ ఒక్క పత్రిక ద్వారానూ మనకు సమగ్ర, స్పష్టమైన సమాచారం దొరకదు. ప్రాంతీయ పత్రికల్లో ఎవరో ఒకరికి కొమ్ముకాచే ధోరణి ఎక్కువ కావడం మనకి ఎక్కువగా కనిపిస్తోంది. దృశ్య మాధ్యమం వైపు ప్రజలు ఎక్కువ మొగ్గు చూపిస్తుండడంతో, పాశ్చాత్య అనుకరణతో కార్యక్రమాలు పట్ల విలువల్ని ప్రతిబింబిస్తుండడంతో గ్రామీణ సంస్కృతి దుష్ప్రభావం పడుతోంది. పశువుల పెంపక కార్యక్రమాలతో ప్రారంభమైన కార్యక్రమాలు, అత్తాకోడళ్ళు, అసూయా కార్యక్రమాల్లోకి వెళ్ళి నేరాలూ - ఘోరాలు, నిజం పేరిట జరిగే కార్యక్రమాలు పెరిగి ప్రజల ఆలోచనా సరళిని ప్రభావం చేస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన పెంచుకొని, ఏవి ఎంతవరకు జనహితానికి పనిచేస్తున్నాయో లేదోనన్న విశ్లేషణ చేసి, ప్రభుత్వాన్ని నిలదీసే బదులు పోటీ కార్యక్రమాలకు పరిమితమై తన బాధ్యతను విస్మరిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ధన సహాయంతో వార్తల్ని ప్రచురించడం కూడా చూస్తున్నాం. మీడియా నియంత్రణకు, నిబద్ధతకు, మీడియాలోని వ్యక్తులు ముందుకు వచ్చి చట్టబద్ధమైన నియమావళిని రూపొందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|