|
|
Articles: My Thoughts | బహునాయకత్వం - Site Administrator
| |
భారతదేశంలో వ్యవసాయం చాలావరకు వర్షాధారం. ప్రతిమూడు సంవత్సరాలలో ఒక సంవత్సరం బాగా, ఒక సంవత్సరం ఒక మోస్తరుగా, మరో సంవత్సరం చాలా తక్కువగా పంటల దిగుబడి ఉంటుంది. ఈ దిగుబడిలో హెచ్చుతగ్గులతో సంబంధంలేకుండా గ్రామం అంగీకరించిన గింజలను ఆసామి కూలీలకు కొలవాల్సందే. ఇది ఆనాటి ఆహారభద్రతా సూత్రం. ఎక్కువ పండిన యేడు ఆసామి ఇంట్లో పెళ్ళిళ్ళు - గ్రామంలో పండుగలు జరుగుతాయి. వాటిలో కూలీ జనానికి తిండి దొరుకుతుంది. ఈ విశ్లేషణ ఇవేళ మన ప్రధానినుండి ఆర్థికవేత్తలందరూ చెప్తున్నదే. కాని పాత వ్యవస్థలో గ్రామస్థులు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు అమలు చేసుకునేవారు. నేటి ప్రజాస్వామ్యంలో ఎవ్వరికీ బాధ్యత లేదు, ఎవరికి వారు సాకులు చెపుతూ, పక్కవాళ్ళ మీద నెపం వేస్తూ కాలక్షేపం చేస్తుంటారు.
మరి సమసమాజం, సామ్యవాదం, దున్నేవాడిదే భూమి - అందరికీ సమానవకాశాలు అని వందేళ్ళుగా మనం చిందులు తొక్కి సాధించిందేమిటి? ఎక్కడ దారి తప్పాం. దీంట్లో ఎవరి పాత్ర ఎంత - ఈ ఆత్మ విమర్శ చేసుకొనే నిజాయితీ కూడా మన చదువుకున్నతరానికి లోపించింది. ఏదో స్వర్గాన్ని జనానికి చూపిస్తూ మధ్యతరగతి పబ్బం గడుపుకుంటున్నది. అన్ని రంగాలు విశ్వసనీయత కోల్పోయాయి. వీళ్ళందరి వైఫల్యం ఫలితంగా పెట్టబడిదారీ వ్యవస్థ, రాజకీయ దళారీ వ్యవస్థ బలపడుతోంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|