|
|
Articles: Short Stories | రైతక్క - Site Administrator
| |
అరుపులు విని అటు దిక్కు నడిచింది పద్మ. నర్సవ్వ ఇంటిముందు గుంపుగా జనం. 'ఎక్స్ గ్రేషియా ఇయ్యాలె... ఎందుకియ్యరు...?' కార్యదర్శిని ఎవరో నిలదీస్తున్నారు. 'ఎట్లిత్తరయ్యా... నీకు కొన తెలువది. మొదలు తెలువది. ఎక్స్ గ్రేషియా ఎవలకిత్తరు...?' ఎవలు సచ్చిపోతే ఇత్తరు...? నోటికచ్చింది మాట్లాడుతరు. అందరూ లీడర్లే... తెలువది పీకది మాట్లాడుతారు. కార్యదర్శి కోపంగా అంటున్నాడు. ఎవరూ నోరు తెరుస్తలేరు. ఎంట ఎమ్మార్వో, ఆరై, ఇంకో ఇద్దరు ముగ్గురు అధికార్లున్నారు. పద్మకు పెయ్యి పొంట ముండ్లచ్చినయి. పెయ్యి జిలజిలమంది. చివరికి ఇది సావులో గూడా రైతు గాకుండా పోయింది అనుకుంది పద్మ. ఆపద్భందు పథకం కింద రాసుకో. బియ్యమిద్దాం... ఎమ్మార్వో అన్నాడు.
నర్సవ్వ భర్త బొందయ్య నెత్తికి చేతులు పెట్టుకున్నాడు. భార్య ఉన్ననాడు పెట్టింది తని, చెప్పింది చేశాడు. ఇప్పుడు ఎద్దు ఎవుసం మూలకు పడ్డది. బొందయ్య బతుకు కొత్తకుండలో ఈగ జొచ్చినట్టయింది. భార్య ఎద్దు ఎవుసాన్ని ఎట్ల నెత్తినెత్తుకున్నది తెలుసు. ఎట్ల ఎల్లదీసిందీ తెలుసు. తనను ఎట్ల ముందుకు నడిపిందీ తెలుసు. తన భార్య రైతేనని ఒక్కమాట చెప్పలేకపోతున్నాడు. కార్యదర్శి ఏదో రాసుకుంటున్నాడు. ఊరిలో మీటింగ్ హడావుడి కనిపిస్తుంది. ఎవరి ఆగంలో వాళ్ళున్నారు. మైకులో పల్లెబాట పాటలు వినిపిస్తున్నాయి.
అక్కడి నుండి ముందుకు కదిలింది పద్మ. కదులుతుంటే నర్సవ్వనే కండ్లల్ల కదిలింది. అప్పుడప్పుడూ తనకు ధైర్యం చెప్పేది. తను మాత్రం ధైర్యం చెడింది. బాధలు మోసింది, బరువు మోసింది. ఆ బరువులు తలకుమించినాక తట్టుకోలేక కండ్లు మూసింది. ఆలోచిస్తూనే నడుస్తున్న పద్మ మూడు తొవ్వల వద్దకుచేరుకుంది. అక్కడనే సభ. జనం పలుచగానే ఉన్నారు. ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. మీటింగ్ మొదలయింది. ముందుకు వెళ్లి నిలబడింది పద్మ.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|