|
|
Articles: TP Features | ప్రాకృతంలో 'తెలుగు' నాడి - Site Administrator
| |
ప్రకృతి అయిన ప్రాకృత భాష నుండి సంస్కరింపబడిన సంస్కృత భాషని పాలక / ధనిక వర్గాలే ఎక్కువగా ఆదరించాయి. గూఢచారికి సంస్కత భాష పరిచయం అవసరం లేదు. ఎందుకంటే అది పైన పేర్కొన్న ప్రజల వ్యవహారంలో లేదు.
భారతదేశంలో ప్రస్తుతం ఇరవై రెండు భాషలను రాజ్యాంగం గుర్తించింది. గుర్తించిన భాషలు వేలు. ప్రస్తుతం భాష అంతరించిపోయే పరిస్థితి నెలకొని ఉంది. ప్రాకృతం, సంస్కృతం ఆనాటి తమ స్వరూపం కోల్పోయి ఇతర రూపాల్లో ఎక్కువగా జీవిస్తున్నాయి. ఏదీ ప్రామాణీకం కాదు. స్థిరం కాదు. ఎల్లకాలం నిలువనట్లే భాష కూడా పరివర్తన చెందుతుంది. అయితే ఈ పరివర్తిత రూపం, స్వభావంపై మరింత అధ్యయనం జరగాలి. అప్పుడే తెలుగుభాషపై ప్రాకృత ప్రభావం, ప్రాకృత భాషలపై తెలుగు ప్రభావం ఎంత మొత్తంలో పడిందో పరిశీలించే ఆస్కారం ఉంటుంది. అంటే ముందుగా ఆయా భాషలని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని గమనించాలి.
అలనాడు ఆరుగురు పండితులు రాళ్ళపల్లి, తల్లావఝ్ఝల, వేటూరి, చిలుకూరు, మానేపల్లి, వేలూరి, పింగళి, మేడేపల్లి - ఆ మధ్య తిరుమల రామచంద్ర, ఆచార్య కమల వంటి కొద్దిమందే ప్రాకృతం నేర్చుకున్నారు. కాని వీరిలో ఎవరూ ఇప్పుడు జీవించి లేరు. నిజానికి తెలుగు భాషాశాస్త్రజ్ఞులు ఇప్పుడు ప్రాకృతభాష నేర్చుకుంటే ఎన్నో కొత్త సంగతులు వెలికివస్తాయి. భాషా శాస్త్రజ్ఞులే కాదు పంచాగ్నుల వారన్నట్లు '... వేదవాఙ్మయ విమర్శనం కోసం పరిశ్రమించేవారు. చరిత్ర కోసం వెతికేవారు కూడా ప్రాకృతం గాలించాలి. ఎన్నో దేశ్యాలు, ఎన్నో కల్పనలు ఎన్నెన్నో వాక్చమత్కారాలు, సరస ఫణితులు, ఎన్నో చరిత్రాంశాలు ప్రాకృతం ఇస్తుంది. తక్కిన వాటిని వదులుకోవలెనని నా మనవి కాదు. దీన్ని ప్రధానంగా ఎంచండి అనే' అని 'ప్రాకృత గ్రంథకర్తలూ ప్రజాసేవానూ' గ్రంథంలో పేజి 115 లో కోరారు. ఇంకా అదే పేజీలో ఇలా అన్నారు - 'శక్తి గలవారు కొందరైనా ప్రాకృతాలలో పరిశ్రమించవలెనని ప్రార్థన' అని 1933లో పంచాగ్నుల వారు చేసిన ప్రార్థనని ఎవరు పట్టించుకుంటారు?
అందుకే మన భాషకు ఇలాంటి పరిస్థితి దాపురించింది. ఇకనైనా ప్రాకృత భాష నేర్పడానికి సంస్థలు ముందుకు రావాలి. నేర్చుకోవడానికి యువకులు సిద్ధం కావాలి. సోదర భాషల అధ్యయనం వల్ల తెలుగుభాష వృద్ధి చెందుతుందని తెలుసుకోవాలి. అలాంటి కొంత్త కాంతి, కొత్త ఆలోచనలే భాషకు శక్తినిస్తాయి. తెలుగు దేశభాష అర్థం కావాలంటే తెలుగుభాష నలుచెరుగుల ఉన్న సోదరభాషలు మనకి తెలియాలి. వాటిని పక్కనపెట్టి ఏ ఒక్క భాషా కుటుంబం పరిశీలనతో తెలుగుభాష, చరిత్ర సమగ్ర తత్వాన్ని అర్థం చేసుకోలేం. పాక్షిక పరిశోధనకే పరిమితం అవుతాం. ఆ పరిధి నుండి బయట పడితేనే కొత్త సంగతులు వెలికి వస్తాయి. ఆ కోణంలోంచి కూడా ఆలోచించాలని వేడుకోలు.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|