|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
1986లో చేయబడిన వినియోగదారుల రక్షణ చట్టంలో 'సేవ', 'సేవలో లోపాలు', నిర్వచనాలవలన, అజాగ్రత్తకు బాధ్యత విషయంలో ఉన్న సందిగ్దత కొంతవరకు తొలగిపోయింది. కాని వైద్యులు వినియోగదారుల చట్ట పరిధిలోకి రారన్నవాదన లేవనెత్తడం, వారు కూడా చట్టపరిధిలోకి వస్తారని, 1995లో సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కోర్టు 'వృత్తి' అనే నాలుగు లక్షణాలుంటాయని పేర్కొంది.
1) చేసే పనిలో ప్రధానంగా నైపుణ్యంతో కూడి, ప్రత్యేకమైనదై ఉండి దాన్లో ఎక్కువభాగం తక్కువ శారీరక శ్రమతో ఎక్కువ మేధపరమైనదై ఉండడం.
2) మనం సాధారణంగా పాటించే నిజాయితీ కంటే ఎక్కువ నైతిక విలువలకు కట్టుబడి, రోగులకు కాని క్లయింట్లకు కాని చేసే బాధ్యత కంటే మొత్తం సమాజానికి బాధ్యత వహించేదయి ఉంటుంది.
3) వృత్తిపరమైన సంఘం విధించే నియమనిబంధనలకు లోబడి ప్రవేశార్హత పొంది, ఆ సంఘం విధించిన ప్రవర్తన, నీతి, నియమావళికి కట్టుబడి ఉండడం.
4) సమాజంలో ఉన్నత స్థానం కలిగి ఉండడం.
వైద్యుడికి రోగికి మధ్య ఉన్న సంబంధం, యజమానికి - సేవకుడికి ఉన్న సంబంధం వంటిది కాదని, పార్లమెంటు అర్థంచేసుకునే 'సేవ' అన్న నిర్వచనం చేసిందని, అందువల్ల వైద్యులు, ఇతర వృత్తులు చేసేవారు ఈ నిర్వచనం క్రింద వస్తారని, ఈ క్రింది తరగతులకు చెందిన వైద్యులు వినియోగదారుల చట్టపరిధిలోకి వస్తారని తీర్పు నిచ్చింది.
1. ఉచితంగా కాకుండా వైద్యుడు రోగికి ఇచ్చే సంప్రదింపులు, రోగ నిర్థారణ, చికిత్స సేవలు, సర్జరీకి సంబంధించినదైనా, మెడిసన్ కు సంబంధించినదైనా సర్వీసు నిర్వచనంలోకి వస్తాయి. కాబట్టి వారు చట్టపరిధిలోకి వస్తారు.
2. ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ రుసుము వసూలు చేసినా వైద్యులు మాత్రం ఉచిత సేవలు అందిస్తే వారు చట్టపరిధిలోకి రారు.
3. ఆసుపత్రులలో కొంతమంది రోగుల దగ్గిర రుసుము వసూలుచేసి మరికొంత మందికి ఉచితంగా సేవలు చేసినా వారు చట్టపరిధిలోకి వస్తారు.
4. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా సేవలు అందించేవారు ఈ చట్టపరిధిలోకి రారు.
5. ప్రభుత్వాసుపత్రులలో కూడా కొందరి దగ్గిర నుండి రుసుము వసూలు చేసినట్టయితే చట్టం వర్తిస్తుంది.
6. వైద్యుడి ఫీజు ఇన్సూరెన్సు కంపెనీ చెల్లించినా లేదా రోగి యొక్క యజమాని చెల్లించినా చట్టం వర్తిస్తుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|