TeluguPeople
  are the trend-setters

 
Articles: Short Stories
తోడు...నీడ
- Site Administrator
< < Previous   Page: 5 of 5    
నిజానికి తన సహోద్యోగి మాత్రమె.అంతగా పరిచయం లేదు. హఠాత్తుగా భర్త పోవడంతో ఇద్దరు పసి పిల్లల్ని తీసుకుని తనని ఆశ్రయించింది. సాటి వ్యక్తి గా తోచిన సాయం చేసాడు. ఆమె కుడా లా చదవడంతో పనిలో సాయపడేది. రాను రాను స్నేహం పెరిగి పెరిగి విడరాని బంధమైంది. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు. దివాణం నిండా జనం. అమ్మా, నాన్న, తాతగారు, నాన్నమ్మా, పిన్నీ, బాబాయి, తమ్ముడూ, మరదలు, పిల్లా పెద్దా పాపల్తో కలకల లాడుతూ ఇల్లంతా సందడి గా ఉండేది. ఇక్కడ్నుంచి దగ్గర లోనే ఉన్న పొరుగూరికి పిల్లలు స్కూళ్ళకీ పెద్దలు ఉద్యో గాలకి వెళ్ళడం పరిపాటి. ఇక పాలేళ్ళు, పని వాళ్ళ మధ్య కోడళ్ళు కుడా ఇంటి పనికే అంకితం. పాడీ, పంటా, వంటా వార్పు, అత్తా, మామా వచ్చే పోయే జనం అందర్ని అన్నీ సమర్ధించుకుని భార్య అనే వ్యక్తి ఏ రాత్రి పదింటికో వెండి మరచెంబుతో నీళ్ళు తీసుకుని గదిలో అడుగు పెట్టేది. సరిగ్గా ఆ రోజుల్లోనే పార్వతి పరిచయం తనకి పన్నీటి జల్లులా తోచింది. అది అలా అలా పెరిగి పెరిగి చివరికి తన డబ్బుతోటి పార్వతి ప్రాణాలు తీసింది. ఈలోగా పెద్ద లందరు ఒక్కొక్కరే నిష్క్ర మించటం... పిల్లలందరు పెళ్ళిళ్ళు, ఉద్యోగాల నెపంతో దూరాభారాలకు తరలిపోయారు. ఆమె పిల్లల బాధ్యతలు కుడా తీరి పోవడం యాంత్రికంగా కాలంతో పాటు కదలి పోయాయి. ఏదో ఒక ఆకారంగా ఉందనుకున్న భార్య తన వల్ల విసిగి అలసి పోయి నా ఖర్మానికి నన్ను ఒంటరి గాణ్ణి చేసి తన దారిన తాను వెళ్ళి పోయింది. ఇప్పుడు తను ఏకాకీ వాలని ఏకాకిగా మిగిలి పోయాడు. అగ్ని సాక్షి గా తన దనుకున్న భార్య తనని విడిచి వెళ్ళి పోయాక ఎవరి భార్యో తనతో ఎందుకుంటుంది? తనెంత పిచ్చివాడు? ఒంటరి తనమే, కాదు వృధాప్యం కుడా ఎంత భయం కరమో ఇప్పుడర్ధ మైంది. ముఖ్యంగా భార్యా భర్త లిద్దరిలో ఏ ఒక్కరు మిగిలినా జీవితం దుర్భరమే. ఒకరి కొకరు తోడు నీడగా, మంచి స్నేహితుల్లా కోరికల కతీతంగా ఒకరి కోసం మరొకరు నిర్మల మైన ప్రేమతో సాగించే జీవనయానం ఎంత మధుర మైనది? బరువు బాధ్యతలు, కలిమి లేములు, ఒడి దుడుకులూ అన్నిటినీ దాటి హాయిగా శేష జీవితాన్ని గడిపే దంపతులు ఎంత దృష్టవంతులు? తన ఈ ఒంటరి పయనం ఎన్నాళ్ళో ఎన్నేళ్ళో? ఎవరున్నా లేక పోయినా అన్ని విధాలా అండగా ఉంటుందనుకున్న పార్వతి తన ఆశని వమ్ము చేసింది. ఆమెని నమ్ము కోవడం తనదే తప్పు. కేవలం తన అవుసరాలకి ఒక పావులా వాడుకుంది. తన అనుబంధాలేవీ వదులు కోలేదు. నేనే ఆమె వ్యామోహంలో పడి సర్వం మర్చి పోయాను. అదొక మైకం... పిచ్చి... ఆ మైకం లో భార్యని ఎంత బాధించానో తలుచు కుంటే బాధగా ఉంది కానీ ఆమె ఎంత నిక్కచ్చిగా చెప్పిందని? అదే తేడా అందుకే స్త్రీ లాలిత్యంలో మగవాడు ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. అలా రాజులూ రారాజులూ మన వేమనా, భర్తృహరి లా ఎందరో మరెందరో. ఆ వయసు దోషమే అంత. ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది ? ఆనాడు సర్వం తన కోసమే ప్రాకులాడిన భార్య లలితని కాదని, ఆమెను బాధించి తిరిగాడు. నేడు తనదనుకున్న పార్వతి దులపరించుకుని ఏమీ కానట్టు వెళ్ళి పోయింది. చివరికి తను అందరికీ దూరమైన విగత జీవిగా మిగిలిపోయాడు. నన్ను క్షమించు లలితా భర్తగా నీకు న్యాయం చేయలేక పోతున్నానన్న బాధ, నీకు దూర మై పోతున్నాననే వేదనా... నన్ను వెన్నాడుతున్నా అది మర్చి పోవడానికే బలహీన పడి ఆమెకి దగ్గరయ్యాను. ఇప్పుడు నన్ను విడిచి స్వేచగా నువ్వు దూరతీరాలకు వెళ్ళిపోయావ్. ఎవరో కవి అన్నట్టు నీ నుండి దూరమౌతా నన్న వేదన నా హృదయాన్ని కాల్చేది అప్పుడు కౄర విధి మనల్ని వేరుచేసి నీవు లేకుండా బతక మన్నది ఇప్పుడు. అనుకుంటూ బాధగా కళ్ళు మూసుకున్నాడు రామారావ్ ఒం...టరి...గా...!

Be first to comment on this Article!

< < Previous   Page: 5 of 5    



 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.