|
|
Articles: My Thoughts | ఆ మనసుకు కళ్ళుంటే! - Site Administrator
| |
ఈ అదనులో విజృంభించేందుకు గిరిజనులకు కావలసిన శక్తియుక్తులను నూరిపోయడంలో మునిగిపోయాం. 1997లో పాడేరులో ప్రాజెక్టు ఆఫీసర్ రామకృష్ణారావు ఆహ్వానించారు కాని ఆయన వెంటనే బదిలీ అయినారు. 2003లో విద్యాశాఖ డైరెక్టరుగా వచ్చారు. గిరిజనులకు మాతృభాషలో విద్యాబోధన పథకానికి ప్రణాళిక తయారుచేస్తూ నన్ను ఆహ్వానించారు. ఆ ప్రయత్నంలో ఉండగా ఆయన ఉన్నత విద్యకోసం వెళ్ళిపోయారు. సర్వశిక్షా అభియాన్ సంచాలకులుగా వచ్చిన మనోహర్ ప్రసాద్ తో రంపచోడవరం, భద్రాచలంలో జరిగిన సమావేశాలలో పాల్గొన్నాను. కాని ఆయన ఆ పదవిలో ఉన్న కొద్దికాలంలో నా కృషికి రూపం ఇవ్వడం సాధ్యంకాలేదు. చెంచులను ఎకోటూరిస్ట్ గైడ్ లుగా రెండు నెలల శిక్షణ నిచ్చే కార్యక్రమం గిరిజన సంక్షేమశాఖలో అదనపు సంచాలకులు శ్రీ చినవీరభద్రుడు మంజూరు చేయించారు కాని ఆ కార్యక్రమాన్ని శ్రీశైలంలో అధికారులు స్థానిక గురుకులానికి అప్పగించారు.
అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి సంస్థ అప్పుతో గిరిజన విద్యాభివృద్ధికి కావలసిన వసతులనేర్పరచారు కాని మానవవనరులను అభివృద్ధి చేయలేకపోయారు. మనకు గిరిజనుల మీద సాహిత్యం తక్కువేమీ లేదు, పరిశోధనలకు కొదవలేదు. అవన్నీ ఉపరితలాన్ని తప్ప, ప్రజాస్వామ్యంలోగల అవకాశాలను, సాంస్కృతిక మూలాలను ఏమాత్రం తెలియచెప్పలేకపోయాయి. ప్రతి గురుకులంలో అనేక భాషలు, సాంస్కృతిక నేపధ్యానికి చెందిన విద్యార్థులుంటారు. వారి విజ్ఞానంలో, సంజ్ఞానంలో ఎంతో సామ్యం, ప్రత్యేకతలు ఉంటాయి. వీటిని గమనించి ఒక పట్టిక రూపొందించుకోగల కనీస స్పృహ పెంపొందించుకోలేక పోయారు. ఆల్ ఫ్రెడ్ క్రోబర్, మార్గరెట్ మీడ్ అంటూ పెద్దపెద్ద మానవశాస్త్రజ్ఞుల పేర్లు వల్లిస్తారు కాని, ఆయా తెగలమీద 'జనగణన' వారు ప్రకటించిన ఎత్నో గ్రాఫిక్ నోట్స్, విలేజ్ మెనో గ్రాఫ్ ల గూర్చి మాత్రం వారికి తెలియదు. మెకాలే చదువులు అని తిట్టిపోస్తాం. మనం ఏం తక్కువ తినలేదు. తెలిసిందే వేదం అనుకునే మనం హిట్లర్ కంటే పెద్ద నియంతలం.
పరిశోధనవశాన విశాఖమన్యంలో ఎక్కువకాలం గడిపినా, సమయం అంతా విషయసేకరణలో, అర్ధం చేసుకోవడంలోనే గడిచిపోయింది. మాల గంగు, నందిపదంలో తరచూ పేర్కొనే ప్రదేశాలను అప్పట్లో చూడలేకపోయాను. ఏక్షన్ ఎయిడ్ లో పనిచేస్తున్న రఘుతో కలిసి 2005 నుండి పాడేరులో స్వచ్ఛంద సంస్థ 'ఆర్క్' శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళుతుండడంతో పాడేరుతో మళ్ళీ అనుబంధం పెరగసాగింది. వడ్డాది మాడుగలలో కోట్ల, వడ్డాది మండలం పిట్టగడ్డలో శివాలయం, కొత్తపల్లిలో మువ్వలమ్మ, గూడెం చింతపల్లి మన్యాలకు ఒకనాటి రాజధాని నర్సీపట్నం మండలంలో వజ్రగడం, విశాఖమన్యంలో మత్స్యరాజుల పూర్వపు రాజధాని పాతపాడేరులో శివాలయం, మండిపర్వతం, పూలగండువనం, మాలగంగుపాదాలు, నందపురం ఈ ప్రదేశాలన్నీ చూశాను. ఆ ప్రాంతాల ఫోటోలు తీయించాను.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|