|
|
Articles: TP Features | విద్యార్థుల విజయం - Site Administrator
| |
తెలంగాణా విషయంలో రెండున్నర లక్షల ఎకరాల భూమి ఎవరెవరు ఎలా ఆక్రమించుకుంటున్నారు అన్న విషయాన్ని పరిశీలించి నష్టపోయిన మూలవాసులకు పరిహారం ఇప్పించాలి. రెంట్ కంట్రోల్ యాక్టు ద్వారా నష్టపోయిన ఇంటి యజమానులకు పరిహారం ఇవ్వాలి. ఎపిపిఎస్సి ద్వారా జరిగిన నియామకాల్లో అన్యాయం జరిగిన నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఆస్తుల పంపకం, ఉద్యోగుల పెన్షన్ ల పంపకం విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. 1956 తర్వాత వచ్చిన భూమి చట్టాలు, ఉద్యోగుల చట్టాలను సమీక్ష చేయాలి. నియోజకవర్గాలను, రిజర్వషన్లను సమీక్షించాలి. బాలికల విద్యను ప్రోత్సహించాలి. మానవ, సహజ వనరుల అభివృద్ధికి ప్రత్యేక, మంత్రిత్వ శాఖలను ఏర్పర్చాలి. ప్రాథమిక విద్య, వైద్య సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. నీటి వనరుల వినియోగం, కొత్త పథకాల రూపకల్పన జరగాలి.
ప్రభుత్వం పంచిన హరిజన, గిరిజన భూములు ఏమయ్యాయో విచారించాలి. కనీసం ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ పరిధిని కుదించాలి. కులాలవారీగా జనాభా లెక్కలను సేకరించి, వారి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించాలి. కోయ, గోండి, చెంచు, లంబాడిగూడేలలో వారి పరిపాలననే ప్రోత్సహించాలి. వారి భూములను, సంస్కృతిని పరిరక్షించాలి. ముస్లిం, మైనారిటీల హక్కులను, ఆస్తులను ప్రత్యేక దృష్టితో చూడాలి. లోతైన దృష్టితో ఇత్యాది ఎన్నో అంశాలను జాగ్రత్తగా పరిశీలించి ఏర్పడే కొత్త రాష్ట్రంలో ఎల్లరికి న్యాయం జరిగేలా జాగ్రత్త వహించాలి.
ఏది ఏమైనా సోదరభావంతో విడిపోవడం ముఖ్యం. జరిగిన నష్టం ఎలాగో జరిగింది. ముందుతరం వారు తీరని నష్టానికి గురై వెళ్ళిపోయారు. ఉన్నవారు మనశ్శాంతితో ఉండడం ముఖ్యం.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|