|
|
Articles: TP Features | తెలుగా, ఆంద్రమా? - Site Administrator
| |
'స్వర్గలోక ప్రశస్తము సంస్కృతము
మహారాష్ట్ర దేశీయంబు ప్రాకృతంబు'
ఆలాటి అప్పుడు సాతవాహనులు మరాటీలు అవుతారు, కాని తెనుగులు ఎలాగ అవుతారు? అనే వివాదాన్ని చరితాకారులు పట్టించుకోలేదు. అందుకే డాక్టరు సుక్తాంకరు అనే చరితా పరిసోదకుడు చెక్కింపుల సాతవాహనులు కేవలము మరాటీ రాజులే, వారికి తెనుగులకు ఏలాటి పొత్తు లేదు (వారి చేత పాలింపబడడము వినా) అని సవాలు చేస్తే తెలుగు చరితాకారుల నుండి దానికి జవాబే లేదు.
కారణము తెలుగు చరితాకారులు పరిసోదకులు కారు, వారు చాటింపుదారులు. వారు నిజాన్ని వెలికితీసి లోకానికి చెప్పడము అనే తప్పు పని చెయ్యరు. వారు చేసే పని ఊడ్చడము, అంటే నారు ఒక చోట నుండి తీసి మరి ఒక చోట నాటడము. తెలుగును తీసి ఆంద్రమును నాటాలి, తెలుగునాడును మార్చి ఆంద్రప్రదేశము మొల ఎయ్యాలి. తెలుగు జాతిని ఆంద్ర జాతిగా మార్చాలి. అంతకు మించి ఏమీ లేదు.
పయి రీతిగా పాతకాలపు సంస్కృత పొత్తాలలో కనిపించిన అంద్ర, ఆంద్ర అనే మాటను, ప్రాకృత రచనలలోని అందక అనే మాటతో ముడిపెట్టి, దానిని ఆంద్రబృత్యులు అనే దానికి జతపరిచి, దచ్చినాదికి దిగుమతి చేసి, పయితానులో పీటము ఎక్కించి, సాతవాహనులతో సమపరిచి, అక్కడ నుండి అందక అనే మాటలో నుండి పుట్టిన అందపదా అనే ప్రాకృత మాటను ఆనుగా చేసుకొని తెలుగునాటి లోకానికి చొప్పించి, దానిని నాటి పరంగా, జాతి పరంగా, నుడి పరంగా తెనుగులపయి రుద్దకలిగిన వారు ఎవరో కాని గటికులు అనే చెప్పాలి, ఒప్పుకోవాలి. నిద్రపొయ్యే వాడు నిద్రపోతూ ఉంటే మేలుకొన్న వాడు మాగాణి పండించినాడు అట.
సంస్కృత ప్రాకృత పొత్తాలలో చెక్కింపులలో అక్కడ అక్కడ ఒక మాట కనిపించిన అంతనే అది తెలుగు మాట అవుతుందా? అది తెనుగులకు వర్తిస్తుందా? వేళ్ళ మీద లెక్కపెట్ట కలిగిన అన్ని సారులు ఎక్కడో ఒకచోట కనిపించిన అంతనే దానిని నోరులేని లోకము మీద రుద్ద పూనడము తెలివితక్కువతనము. అలాగ రుద్దడము దబాయింపు విదానము అవుతాయి. ఆంద్ర అనే మాటకు నాలుగు కోట్ల తెనుగులకు కల పొత్తు సంస్కృత ప్రాకృత పొత్తాలలోని, చెక్కింపులలోని సంగతులను పట్టి నిర్ణయము కాదు. కాబట్టి తెలుగులో రచనలు మొదలుపెట్టిన తరువాతనే ఈ చిక్కును పరిసీలించి తేల్చడము మంచిది. నేడు మన నడుమ తెలుగు నానుడిగా చెలామణి అవుతూ ఉండే పొత్తాలను ఆయా యుగాల మేరకు తీసుకొని పరికిద్దాము.
అనువాద యుగము :
ఆది అనువాదకుడు నన్నయ (11 - డో నూరేడు 0 నుండి అనువాద సార్వబవుముడు శ్రీనాదుని (15-నో నూరేడు) వరకు తెలుగు నానుడి అనువాదాలతో మొదలుపెట్టి అనువాదాలతోనే పెరిగి, పెంపొందింది. ఈ అనువాదాలు ఎక్కువగా సంస్కృతము నుండి జరిగినాయి. ఏ కారణము చేతనో ఈ యుగములో మవులిక రచనలకు అండ లబించలేదు. ఆనిడిగా (independently) రచింప పూనిన వారిని (అది చాలా కొద్దిగానే అనుకోండి) ఆ నాటి లోకము ఆదరించలేదు, అవమానించింది, కానవాలించింది, నాలించింది, తొక్కి ఏసింది. ఈ యుగములోని అనువాదకులు తాము సంస్కృతములో నుండి తెలుగులోనికి అనువాదము చేస్తూ ఉన్నాము అన్నారా? ఆంద్రము లోనికి రచిస్తున్నాము అన్నారా? అనే సంగతులను ఇప్పుడు చర్చిద్దాము.
(అ) ఆది అనువాదకుడు నన్నయ్య (కీ.త.1022-1063) :
రారాజు కోరింది :
'జననుత కృష్ణద్వైపాయన
ముని వృషబాబిహిత మహాబారత:బ
ద్ద నిరూపితార్దమేర్పడ
దెనుగున రచియింపు మదిక దీయుక్తి మెయిన్'
నన్నయ నిర్ణయము :
'సారమతింగవీంద్రులు ప్రసన్న కవితార్ద యుక్తితో
నారసి మేలునానితరులక్షరరమ్యతనాదరింపనా
నారుచిరార్ద సూక్తి నిది నన్నయబట్టు తెలుంగునన్మహా
బారత సంహితా రచన బందురుడయ్యె జగద్దితంబుగన్'
అంటూ, నన్నయ చేసిన పని :
'పంచమ వేదంబగు బారతంబును తెనిగింప
గంటిని, దన్యుడనయితిని అని ఎంచి...'
దీనిని పట్టి మనకు తెలియగలది ఏమి? నన్నయ నాటికి మంది పలుకు తెనుగు, తెలుంగు అనే రెండు రూపాలు కలిగి ఉండింది అని తెలుస్తుంది. అంతేకాదు, అది ఆ నాటికే తెనిగించు తెలిగించు అనే చేత (verb) రూపాలను కూడా సంతరించుకొని ఉండిన అట్టు తెలుస్తుంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|