|
|
Articles: TP Features | రాజ్యాంగానికి షష్టిపూర్తి - Site Administrator
| |
గడచిన 60 ఏళ్ళలో మన నైతిక విలువలు విపరీతంగా పడిపోయాయి. ఇది అన్ని రంగాలకు వ్యాపించిన జబ్బు. దీనికి ముఖ్యకారణం ధన ప్రభావం. రాజకీయాలు ధనం చుట్టూ తిరుగుతున్నాయి. ధనవంతుల ప్రభావానికి ప్రభుత్వాలు గజగజలాడుతున్నాయి. ప్రజాస్వామ్య బలౌతోంది. ప్రభుత్వాధికారులు రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తుతున్నారు. నియంత్రణ సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ఈ పతనానికి న్యాయ వ్యవస్థ మినహాయింపు కావడం లేదు. ఫలితంగా రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దీనివల్ల మొత్తం రాజ్యాంగ యంత్రం నిర్వీర్యమైపోతోంది.
1924-25 ప్రాంతంలో వెల్లూరు జైల్లో ఉన్నప్పుడు రాజాజీ అన్న మాటలు నిజం చేసుకుంటున్నాం. 'స్వరాజ్యం వచ్చిన వెంటనే కాని కొన్నాళ్ళ తర్వాత కాని మంచి ప్రభుత్వాన్నిస్తుందని, ప్రజల్ని సంతోషపెడ్తుందని మనం అనుకోనక్కర లేదు. మనకు స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే అవినీతి ఎన్నికలు, అన్యాయం, ధనం వల్ల వచ్చిన అధికారం, క్రూరత్వం, అసమర్ధ పరిపాలన మన జీవితాన్ని నరక ప్రాయంగా చేస్తాయి.'
రాజ్యాంగ పనితీరును సమీక్షించిన సంఘం ముగించిన మాటల్లోనే ఈ వ్యాసాన్ని ముగిస్తాను.
'ఈ పరిస్థితిని చక్కదిద్దాలంటే పౌరులను వివేకవంతుల్ని చేయడమే ముఖ్యం. ఒక ప్రజాస్వామిక వ్యవస్త పౌరుల కనీస అవసరాల్ని తీర్చలేకపోతోందంటే ప్రజలు తమని తప్ప ఎవర్నీ నిందించనక్కరలేదు. మానవ చరిత్రలో 200 సంవత్సరాల క్రితం మనల్ని కదిలించే సంఘటనలో 'పాంటియర్ పైరేట్' అక్కడ పిచ్చిపట్టిన ప్రజల్ని దొంగని క్షమించాలా లేక జీసస్ ను క్షమించాలా అని అడిగితే వారు దొంగనే క్షమించమంటారు. ఫలితంగా జీసస్ శిలువవేయబడ్డాడు'.
ఈ రాజ్యాంగం మనది మనం ఇచ్చిన అధికారంతో నాయకులు, ప్రభుత్వాధికారులు, న్యాయమూర్తులు రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్నారు. మనం అధికారమిచ్చిన వాళ్ళు మన మీద పెత్తనం చేస్తుంటే, మనం చూస్తూ ఊరుకుంటే, వాళ్ళని తప్పుపట్టి లాభం లేదు. అధికారానికి దూరంగా పౌరసంఘాలు తమ పాత్రని తాము నిర్వర్తించాలి. అధికారానికి పోటీ పడకూడదు. స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే రాజ్యాంగం పనిచేస్తుంది. లేకపోతే రాజ్యాంగం పుస్తకంలో పేజీలకు పరిమితమౌతుంది. అధికార దర్పానికి మనం బలి అవుతాం.
| Be first to comment on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|