|
|
Articles: My Thoughts | అజాగ్రత్తకు మందు - Site Administrator
| |
ప్రభుత్వాసుపత్రులలో అత్యవసర కేసును పడక లేదన్న కారణంతో తిరస్కరించడం రాజ్యాంగంలోని జీవించే హక్కుకు భంగమంది. సరియైన అర్హతలు లేకుండా ఎవరైనా రోగికి సేవలందిస్తే వాళ్ళు బాధ్యులంది. ఎలక్ట్రో హోమియోపతిలో పట్టా పొందిన వైద్యుడు ఒక రోగికి అబార్షన్ చేస్తే, ఆ రోగి మరణిస్తే, అతనికి అల్లోపతి విధానంలో అర్హత లేనందున ఒకటిన్నర సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ తర్వాత పిల్లలు పుడితే వైద్యుడి తప్పు లేదంది. అనెస్తీషియా సరిగా ఇవ్వని కారణాన, ముక్కు అలెర్జీకి సంబంధించిన ఒక విద్యార్థి మెదడు దెబ్బతిని తను నేర్చుకున్నది పూర్తిగా మరచిపోతే వైద్యుడు బాధ్యుడంది.
ఒక వైద్యురాలు జర్మనీలో ఎమ్.డి. ప్రీబర్గ్ అన్న డిగ్రీ (మన ఎమ్.బి.బి.ఎస్.తో సమానం) పొంది ఎమ్.డిగా చలామణి అవుతూ, ఒక ప్రసూతి కేసులో అజాగ్రత్తగా వ్యవహరించినందుకు బాధ్యురాల్ని చేసింది. ఒక రోగి ఆపరేషన్ తర్వాత మరణిస్తే, వారి బంధువులు ఆ రోగి అస్థికలతో బాటు కత్తెర్లను చూసి ఆశ్చర్యపోయి కేసువేస్తే, చండీఘర్ లోని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆ వైద్యుడ్ని బాధ్యుడ్ని చేసింది. ఒక బాలుడు జ్వరంతో ఒక నర్సింగ్ హోమ్ లో చేరితే, అర్హతలులేని నర్సు ఎక్కువ మోతాదులో 'లారియాగో' సూదిమందు ఇవ్వడం వల్ల ఆ బాలుడు చనిపోతే ఆ వైద్యుడ్నీ, నర్సునూ బాధ్యుల్ని చేస్తి పరిహారమిచ్చింది కోర్టు.
ఒక ఉచిత వైద్య శిబిరంలో కళ్ళ ఆపరేషన్ చేయించుకున్న వారిలో చాలామంది చూపుకోల్పోతే న్యాయస్థానం ప్రతి రోగికి 12,500ల రూపాయలు చెల్లించమని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యాయస్థానాలు వేటకుక్కలు కావు. కాపలాకుక్కలే అని వ్యాఖ్యానించింది. ఒక అంగానికి బదులు వేరొక అంగం తీసివేసినపుడు, ఒక రోగికి కాకుడా వేరొక రోగికి శస్త్రచికిత్స చేసినప్పుడు, ముందుజాగ్రత్త లేకుండా రోగికి అలెర్జీ కలిగించే మందులిచ్చినప్పుడు, అనెస్తీషియా విషయంలో శ్రద్ధ చూపించనపుడు తప్పక అజాగ్రత్త క్రింద పరిగణనలోకి తీసుకోవాలి.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|