ఏప్రిల్ 14న హజారిబాగ్ జిల్లాలోని రైల్వే క్యాంప్ కార్యాలయాన్ని దగ్ధం చేశారు.
గడ్చిరోలిలోని కంబనపుర గ్రామంలో ఇన్ ఫార్మర్ పేర ఒకరిని కాల్చివేశారు. (`నిర్మూలించారు'). ఇది ఏప్రిల్ 5న జరిగింది. ఏప్రిల్ 9న ఒరిస్సాలోని మల్కాన్ గిరి జిల్లాలో పేటగ్రామంపై దాడి చేసి గ్రామ పెద్దను మరో ఇన్ ఫార్మర్ ను హత్యచేశారు.
ఏప్రిల్ 13న ఒక సిపిఎం నాయకుడితో పాటు మరో ఇద్దరు కార్యకర్తలను పశ్చిమబెంగాల్ లో కాల్చి చంపారు.
ఏప్రిల్ 14న బీహార్ లో రైల్వే పోలీసులపై దాడి చేసి ఒక సబ్ ఇన్సెక్టర్ తో సహా ఐదుగురిని కాల్చి వేశారు, 44 ఆయుధాలు దోచుకున్నారు.
ఇలా రాసుకుంటూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇవన్నీ చట్టబద్ధమైన హత్యలేనా? బూటకపు హత్యలా?... నిజమైన ఎన్ కౌంటర్లా?... లేక బూటకపు ఎన్ కౌంటర్లా?... అసలు ఏది కౌంటర్?... ఏది ఎన్ కౌంటర్?... ఓ మహాత్మా... ఓ మహర్షీ నువ్వైనా విజ్ఞత కల్పించి సమాధానం వచ్చేలా చూడు.