
|
|

General Forum: Literature | విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో ... | |
| baagundi panchukonEvaarE lEru
Posted by: Mr. Pavan Kumar Pavankumar At: 26, Sep 2012 11:19:36 AM IST విశ్వనాథ వారి రామాయణకల్పవృక్షంలో కొన్ని పద్యాలను (నాకు అర్థమైనవి, ఇష్టమైనవి, సుకుమారమైనవి ) మీతో పంచుకుంటాను.
1.తానో “లాములు”,“తండ్రి పేరెవరయా?”“దాచాదమాలాలు”-“నౌ
లే, నాపేర?”న “నమ్మగాల”నగ నోలిందల్లి - “కౌసల్య తం
డ్రీ !”నాగాననబోయి రాక కనులన్ నీర్వెట్టఁగౌసల్య “నౌఁ
గానే కానులె యమ్మనే!” యని ప్రభున్ గౌసల్య ముద్దాడినన్.
( రామాయణ కల్పవృక్షం , బాలకాండ, అవతార ఖండం )
బాలరామునకు అప్పడప్పుడే మాటలు వస్తున్న సందర్భం.కౌసల్యా, బాలరాముల సంభాషణం. పిల్లల వచ్చీ రాని మాటలు ఎంతో ముచ్చట గొలుపుతూ ఉంటాయి.
కౌసల్య : (ఈ అబ్బాయి) తానెవరయ్యా?
రాముడు : లాములు (రాముడు)
కౌసల్య :మరి తండ్రి పేరెవరయ్యా?
రాముడు :దాచాద మాలాలు ( దశరథమహారాజు)
కౌసల్య : ఔనులే. మరి నాపేరు ..?
రాముడు : అమ్మగాలు .. (అమ్మగారు)
కౌసల్య : కాదు తండ్రీ ! నాపేరు..కౌసల్య
*బాలరాముడు “కౌసల్య” అనబోయాడు. కానీ ఆ పేరు పలకటం రాకపోవటంతో ఏడవటం ప్రారంభించాడు. అతడు ఆ పేరు చెప్పలేక కన్నీరు పెట్టటం కౌసల్య భరించలేకపోయింది. వెంటనే- కౌసల్య : (సరే నాన్నా!) నేను కౌసల్యను కాదురా ! .. అమ్మనే! .. (“అలాగే అను”) అంటూ బాలరాముని ముద్దాడింది.
ఇది ఎంత మధుర సన్నివేశమోకదా.
Posted by: Mr. kompellaramakrishna murty At: 19, Dec 2011 11:48:33 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|