Discussion on Vijayawada in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Vijayawada
పద్యాలను చూసి చదివే పోటీ
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
తెలుగుపద్యాలు చూసి చదివే పోటీ భారతగణతంత్ర దినోత్సవం సందర్భంగా 26-01-2013 శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచే విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపాన అంతర్జాతీయ వైజ్ మెన్స్ విజయవాడ టౌన్ క్లబ్ సేవాకేంద్రం హాలులో పదిసంవత్సరాలు అంతకులోపు వయస్సుగల చిన్నారులతో కళకళలాడసాగింది. కొందరు చిన్నారులతో వారి తల్లితండ్రులు, కొందరు ఆయాబడి ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు కూడా వచ్చారు. క్లబ్ కోశాధికారి డాక్టర్ వేదాంతం రామకృష్ణమాచార్యులుగారు వచ్చిన చిన్నారుల పేర్లను నమోదు చేసుకుంటున్నారు. తొమ్మిదింపావుకు క్లబ్ మేడపైన డాబామీద క్లబ్ అధ్యక్షులు కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి, చిన్నారులు పెద్దలు వందేమాతరం గీతం ఆలపించాక, జాతీయపతాకం ఎగురవేసారు. అందరూ ముక్త కంఠంతో జణగణమన గీతాన్ని ఆలాపించారు. అందరకీ చాకలైట్లు పంచారు. సరిగ్గా తొమ్మిదిన్నర గంటలకు వచ్చినవారందరకీ వేడి వేడి ఉప్మాను క్లబ్ లో కంప్యూటరు కుట్టుమిషనులలో శిక్షణగరిపే శ్రీమతి నందిని, దివ్యలలితలు ఇచ్చారు. పదిగంటలయింది. తెలుగు పద్యాలను చూసిచదివే పోటీ ప్రారంభిస్తున్నట్టు అధ్యక్షులు కాలనాధభట్టవీరభద్రశాస్త్రి ప్రకటించారు. న్యాయనిర్ణేతలుగా డాక్టర్ వేదాంతం రామకృష్ణమాచార్యులుగారు, కాజ వందనకళ్యాణిగారు వచ్చి కూర్చున్నారు. సుమారు 35 మంది చిన్నారులు బుద్ధిగా నేలమీదకూర్చున్నారు. పెద్దలు, క్లబ్ సభ్యులు వెనవేసివున్న కుర్చీలపై ఆసీనులయ్యారు. నమోదుచేయబడ్డ పేర్లనుండి వరుసగా క్లబ్ అధ్యక్షులు శాస్త్రి పిలవసాగారు. వేమన, సుమతీ శతకపుస్తకాలనుండి ఎంపికచేసిన చేరొక పద్యం చూసి చదవమన్నారు. ఫరవాలేదు. ఈచిన్నారులు కొందరు చూసి చదవడంలో తడబడ్డా ఎక్కువమంది బాగానే చదివారు. చదివిన ప్రతి బాలునికి, బాలికకు ఒక పెన్సిలు, రబ్బరు తో కూదియున్న పెన్సిలు పెట్టె ఇచ్చారు. ఈపోటీ పదకొండున్నరగంటలవరకు సాగింది. ఆతర్వాత ప్రారంభింపబడిన బహిరంగ సభకు కృష్ణాజిల్లా రచయితల ప్రధానకార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచంద్ అధ్యక్షతవహించారు. తమ అధ్యక్షోపన్యాసంలో తెలుగుభాషోద్యమ వుద్యమంగురిం ప్రస్తావిస్తూ, ప్రతిబాలిక, బాలుడు విధిగా తెలుగు నేర్చుకోవాలని, తెలుగులో మాట్లాడితే శిక్షించే కాన్వెంట్ స్కూళ్ళను బహిష్కరించాలని సూచించారు. క్లబ్ మరియు నవ్యసాహితీసమితి విజయవాడ శాఖ అధ్యక్షులు వీరభద్రశాస్త్రి ఈపోటీ ఆవశ్యకతనుగురించి వివరించారు. ఆంగ్లమాధ్యమంలో చిన్నారులు చదువుకోవడం వల్ల, తెలుగు భాషను విస్మరించేప్రమాదం వుందని, తెలుగు మాధ్యమంలో పాఠాలను భోదించవలసిన ఆవశ్యకత వుందని అయితే ఈచిన్నారులు తెలుగులో చదవడం వ్రాయడం పట్ల ఇంట్లో తల్లితండ్రులు, పాఠశాలలో ఉపాధ్యాయులు శ్రద్ధవహించాలి, అప్పుడే ముందుతరాలవాళ్ళు తెలుగుభాషను మర్చిపోకుండా తర తరాలు కొనసాగించగలరని అన్నారు. స్వదేశంలోను, విదేశంలోను చాలామంది తెలుగులో మాట్లాడుతారు, పాటలుపాడతారు, కాని కొందరు తెలుగు లిపి రాక ఆంగ్లలో వ్రాసుకుని చదువుతున్నారని, ఆదుస్థితిపోవాలంటే విధిగా తెలుగులో చదవడం వ్రాయడం రావాలని, అందుకనే ఈనాడు చూసిచదివే పోటీ ఏర్పాటుచేసామని చెప్పారు. అంతర్జాతీయ వైజ్ మెన్స్ సంస్థ రీజినల్ డైరెక్టర్ కురెళ్ళరామచంద్రరావు క్లబ్ చేస్తున్న కౄషిని మెచ్చుకున్నారు. ఈతరహా పోటీలను మచిలీపట్నంలో కూడా తాము నిర్వహిస్తామన్నారు. క్లబ్ మాజీ అధ్యక్షురాలు జయశ్రీ, రీజినల్ సమాచార పత్రిక సంపాదకులు శ్రీనివాసరావు ఇటువంటి పోటీలను తరుచూ నిర్వహించాలని సూచించారు. క్లబ్ కోశాధికారి డాక్టర్ వేదాంతం రామ కృష్ణమాచార్యులు ఉగాది విశిష్థతగురించి తెలుగులో వ్యాసరచనపోటీని త్వరలో ఎనిమిది తొమ్మిది పదవ తరగతి విద్యార్ధినీ, విద్యార్ధులకు నిర్వహిస్తామని, వారికి బహుమతులను తాను ఇస్తామని ప్రకటించారు. ఈపోటీలో ప్రధమవిజేతగా కుమారి ఎ.సాత్విక,ద్వితీయ విజేతలుగా కుమారి తిరుపతమ్మ, సి.హెచ్ శివరామకృష్ణ, తృతీయ విజేతగా కుమారి సి. లలితహాస ఎంపిక అయ్యారు వారికి ముఖ్య అతిథి కురెళ్ళ రామచంద్రరావుగారు బహుమతులు అందజేసారు. క్లబ్ ప్రధాన కార్యదర్శి కాజ వందనకళ్యాణి వందన సమర్పణ చేసారు

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 29, Jan 2013 0:49:32 AM IST
అంతర్జాతీయ వైజ్ మెన్స్ సంస్థ విజయవాడ టౌన్ క్లబ్ ఆధ్వర్యంలో 26-1-2013 శనివారం ఉదయం 10 గంటలకు విజయవాడ సత్యనారాయణపురం మారుతీవ్యాయాశాల సమీపానగల గాయత్రీవైద్యశాలమేడమీద క్లబ్ సేవాకేంద్రమందు 10 సంవత్సరములు అంతకులోపు వయస్సుగల బాలబాలికలకు వేమన, సుమతీశతకాలలో నిర్వాహకులు ఎంపికచేసిన పద్యాలను చూసి చదివే పోటీ జరుపబడుతుంది. ఈపోటీలో సత్యనారాయణపురం,ముత్యాలంపాడు పరిధిలోగల పాఠశాలలోచదువు 10సంవత్సరములలోపు బాలబాలికలు మరియు స్థానికంగా ఆప్రాంతంలో నివసించు 10సంవత్సరములలోపు బాలబాలికలు పాల్గొనుటకు అర్హులు. అయిదుగురు విజేతలకు తలొక వందరూపాయలు బహుమతిగా ఇవ్వబడును. మరియు పాల్గొన్న ప్రతి బాలబాలికలకు ఒక ఙ్ఞాపిక ఇవ్వబడును. ఈపోటీ కేవలం ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న బాలబాలికలకు తెలుగుభాషను చదువుట, వ్రాయుటలో ఆసక్తిని పెంపొందించుటకు ఉద్దేశింపబడింది. తెలుగుమాటలను అంగ్లంలోవ్రాసుకునే దుస్థితి తొలగించాలని చూసి చదవాలనే నిభందనను పొందుపరచినాము. కావున వారంరోజులు పైగాసమయం వుందిగనుక, ఆయాపాఠశాల యాజమాన్యం, మరియు తల్లితండ్రులు పిల్లలకు చూసి చదవడంలో తర్ఫీదు ఇచ్చి పోటీకి పంపగలరు ఆసక్తిగలబాలబాలికలు క్లబ్ కార్యాలయమందు ఆదివారం మినహా మిగిలిన రోజులలొ ఉదయం 9-30 నుంచి 11-30 మధ్యకాలంలో తమపేర్లను నమోదుచేసుకునగలరు. వివరాలకు క్లబ్ అధ్యక్షులు కాలనాధభట్టవీరభద్రశాస్త్రి, ఫోన్ 0866-2400485. 2531766 సెల్ 9849104811 ను సంప్రదించగలరు.

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 18, Jan 2013 8:10:51 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.