|
|
Articles: My Thoughts | చెట్ల వెక్కిరింత - Site Administrator
| |
దుగ్గరాజు శ్రీనివాసరావు
ఇటీవల విశాఖపట్నంలో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నడుస్తున్న ముగ్గురు ఎమ్.బి.ఎ.విద్యార్థినులను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. హైదరాబాద్ నుండి స్టడీ టూర్ కి వెళ్ళిన ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏటా మనదేశంలో అరవై వేల నుండి లక్షమంది వరకు రోడ్డు ప్రమాదంలో మరణించటమో, తీవ్రంగా గాయపడటమో జరుగుతోంది. వీరిలో చాలామంది రోడ్డుకు పక్కగా నడుస్తున్నవారే. రోడ్డు మీద వాహనాలు వెళ్లేందుకు ఎంత హక్కున్నదో పాదచారులకు అంతే హక్కుంది. కాని వాహనాలు పాదచారుల నడిచే హక్కునే కాక వారి ప్రాణాలనే హరిస్తున్నాయి.
రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు హడావుడి చేయడం, ఆ తర్వాత ప్రమాదంలో గాయపడినవారిని, ప్రాణాలు కోల్పోయినవారిని మరచిపోవడం చేస్తున్నారు. మహా అయితే మరుసటి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవ సమయంలో గుర్తుకు చేసుకుంటున్నాం. రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణమంటున్నారు. మొన్నటి విశాఖపట్నం రోడ్డు ప్రమాద సమయంలో ఆర్టీసీ డ్రైవర్ సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే చాలామంది డ్రైవర్లు రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల నిర్లక్ష్యం ఒక్కటే కారణం కాదంటున్నారు. ఇరుకు రోడ్ల వల్ల వాహనం పక్కకు తప్పించే అవకకాశం వుండటం లేదన్నది డ్రైవర్ల ఫిర్యాదు.
అయితే వాహనాలకు ఎంతో రోడ్డు అవసరం! ఒకప్పుడు ఒక చిన్న తారురోడ్డు వుంటే చాలు. ఇప్పుడు డబుల్ రోడ్డు సర్వసాధారణం. ఆరులేన్లు, ఎనిమిది లేన్లు అంటూ పెంచుకుంటున్నారు. రోడ్లు పెరిగితే వాహనాలు ఫ్రీగా వెళ్ళగలుగుతాయన్నది నమ్మకం. అదే నిజమైతే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్స్ వుండకూడదు. తొమ్మిదేళ్ళపాటు రోడ్ల విస్తరణే ప్రధాన అంశంగా పనిచేసిన ప్రభుత్వం మనల్ని పాలించింది. రోడ్లు విస్తరణ తర్వాత తేలింది.... ఎంతగా రోడ్లు విస్తరించినా ట్రాఫిక్ సమస్యలు తీరదని. మరో పరిష్కారంగా ఫ్లై ఓవర్లు కట్టారు. ఆ విధంగా ట్రాఫిక్ సమస్య తీరుతుందని అనుకున్నారు. కానీ అదీ కుదరలేదు.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|