|
|
Articles: TP Features | మృతజాతిగా మిగిలిపోదామా? - Site Administrator
| |
(డాక్టర్ సామల రమేష్ బాబు)
కొత్త లోక్ సభలో, శాసనసభలో తల్లి నుడి (తల్లిభాష - మాతృభాష)లో ప్రమాణ స్వీకారం చెయ్యని తెలుగు ప్రతినిధులను ఒక కంట కనిపెట్టి ఉండాలి. వారికి స్ఫూర్తినిచ్చి ఆలోచనను రగిలింపజేసి, వారు చేసిన తప్పును తెలుసుకొనేట్లు చెయ్యాలి. `తల్లి నుడిని మరచిన జాతి చచ్చిన జాతి'యేనని ఒక మహానుభావుడు రాశాడు. అయితే, ఇక్కడి సందర్భంలో మనం ప్రస్తావించుకొన్న ప్రతినిధులు తెలుగుజాతికి ప్రతినిధులు కాజాలరని మనం అనుకోవాలి. ఎందుకంటే ఇంకా తెలుగుజాతి చావలేదు!
దారీ దిక్కూ తెలియక, సాంస్కృతిక దివాళాకోరుతనంలోకి తమను నెట్టివేస్తున్న పాలకవర్గాలనూ, వారిని వెన్నంటి ఉండే రాజకీయ, ఉద్యోగ వర్గాల దుర్మార్గపు పోకడలను జాతి కనిపెడుతూనే ఉంటుంది. అపనమ్మకమూ, పట్టనితనమూ అడుగడుగునా ఆటంకాలుగా ఉన్న ఈ సాంప్రదాయిక సమాజంలో ఉద్యమాలు ఊపిరిపోసుకోవడానికి సమయమూ, శ్రమా తప్పనివే అయినా, అందుకు ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి. `సిరిగలవానికి బానిస కొడుకులు' గా వర్తించేవారంతా అధికారంలో ఉన్నవారి పట్ల అంతకంటే తక్కువ స్థాయిలో వ్యవహరిస్తారు. తెలుగుజాతికి వీళ్ళే ఎక్కువ సమస్యల్ని తెచ్చిపెడుతుంటారు.
అధికారానికి ఎగబాకే క్రమంలో ఎంత నీచానికి వీరు జారిపోగలరో ఇటీవలి ఎన్నికల్లో మనం చూశాం. భాష, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాలను రాజకీయ అజెండాలోకి తేలేకపోవడం ఈ జాతి బలహీనత. అధికారంలోకి రావడానికి ఇవి పనికొచ్చే అంశాలుగా లేవు గనుక వీటి సంగతి రాజకీయులకు పట్టదు! నిన్నటి ఎన్నికల్లో జరిగిందీ, తర్వాత జరుగుతున్నదీ అదే. మంత్రివర్గ నిర్మాణంలో ఇటు రాష్ట్రంలోనూ తెలుగుకూ, అటు కేంద్రంలో తెలుగుజాతికీ అవమానమే మిగిలింది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|