|
|
Articles: TP Features | మహిళల పాలిట కల్పవృక్షం - Site Administrator
| |
(ఆచార్య రావెళ్ళ కృష్ణారావు)
`యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా'
`స్త్రీలను పూజించే చోటే దేవతలు నివసిస్తారు' అన్నది ఆర్యోక్తి.
ఆమె ప్రేమ విశ్వజనీనం.
కష్టాల్లో ఉన్న మహిళలకు ఆమె ఆలంబన.
దిక్కులేని వారికి ఆమె ఆశాకిరణం.
ముదిమితో జీవితం నరకప్రాయమైన వారికి ఆమె ఆదరణ అనుపమానం.
చదువుకోవాలనుకునేవారికి ఆమె ఆశాదీపం.
వైద్యం, ఆరోగ్య రక్షణలకు ఆమె ఆటపట్టు.
స్వావలంబన ఆశించేవారికి ఆమె ఆరాధ్య దైవం.
సాంత్వన కలిగించే ఆమె ప్రేమైకమూర్తి, ఆపదల నుండి గట్టెక్కించే ఆప్తురాలు.
ఆ చేతులు అన్యాయాన్ని అరికడతాయి.
ఆమె మాటలు ధైర్యాన్ని నూరిపోస్తాయి.
ఆమె వేసిన ప్రతి అడుగూ మార్గదర్శకమే.
ఆమె నీడ రక్షణ వలయమే.
ఆమె బాల్యం నుండే సేవాభావం చిగురించిన వ్యక్తి.
ఆమె స్వేచ్ఛా సమానత్వాలకు ప్రతిరూపం.
బాల్యంలో చదువు ప్రాథమిక స్థాయిని దాటకపోయినా అకుంఠిత దీక్షా దక్షతలతో న్యాయవాద పట్టా పుచ్చుకున్న ఏకైక తెలుగు మహిళ.
పసిప్రాయంలోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న తెగువ కలిగిన మగువ.
11 ఏళ్ళ పిన్న వయస్సులోనే గాంధీజీని సైతం ప్రభావితం చేసి ఆయన ప్రేమాభిమానాలు చూరగొన్న తెలుగింటి ఆడపడుచు.
ఆమె ధైర్య, స్థైర్యాలు కలిగిన ప్రతిభాశాలి.
కష్టాలకు, కన్నీళ్ళకు చలించని వ్యక్తిత్వం ఆమెది. ఆమె సేవల తల్లి దుర్గాబాయి.
ఆమె స్త్రీల పాలిట కల్పవృక్షం.
ఆర్తిని తీర్చి స్ఫూర్తినిచ్చిన ఆమె - సేవలతల్లి దుర్గాబాయి.
స్వాతంత్ర్యయోధురాలిగా మన దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని మరెందరో తెలుగు మహిళలను స్వతంత్ర పోరాటంలో పాల్గొనేటట్టు చేసిన ధీరశాలి.
రాజ్యాంగ నిర్మాణ సభ సభ్యురాలిగా, ప్లానింగ్ కమిషన్ సభ్యురాలిగా, కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్ పర్సన్ గా, ఆంధ్ర మహిళాసభ వ్యవస్థాపకురాలిగా ఆమె నిర్వహించిన పాత్ర అనితర సాధ్యం.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|