|
|
Articles: TP Features | తల్లిని విస్మరిస్తే అంతే మరి! - Site Administrator
| |
(ఆచార్య ఆర్వీయస్ సుందరం)
రాష్ట్రంలో ఎన్నికల ప్రహసనం ముగిసింది. కోట్ల కొద్దీ నల్లధనం ఏరులై పారింది. వాగ్దానాలు సముద్రపుటలల్లా పొంగి ఉప్పెనలై ముంచాయి. అవినీతిని సమర్థిస్తారా, అందలాలెక్కుతారా, అన్నపానాలు తప్ప అన్నింటినీ ఆశిస్తారా అంటూ రాజకీయ నాయకులు చేసిన తప్పుడు ప్రసంగాల్ని నమ్మి జనం ఓట్లు వెయ్యడమూ జరిగిపోయింది. అటు సామాన్యుడు ఓటు వెయ్యడం, ఇటు తక్షణమే ఇదే రాజకీయ నాయకులు వాడి మొహాన్నే ఉమ్మేయటం జరిగిపోయింది. మళ్ళీ ఆ ఉమ్మినంతా తుడిచేసుకుని మనం మరో ఎన్నికల కోసం ఎదురుచూద్దాం.
అవినీతిని నిర్మూలిస్తాం, ప్రణాళికలు చేపడ్తాం, దుర్మార్గుల్ని ఉరితీస్తాం అంటూ ఎన్నో ప్రగల్భాలు పలికిన వారు కూడా ఓటు పర్వం ముగియగానే `రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు అంటూ ఎవరూ లేరు' అని చెప్పడం చూస్తే ప్రజలంతా తెలివిలేని వెధవలు అని ఈ రాజకీయ నాయకులు బలంగా నమ్మినట్లే కదా?
ఈ నాయకులలో ఒక్కరు కూడా తెలుగు గురించి మాట్లాడకపోడవం చూస్తే వీళ్ళు పుట్టింది తెలుగు పుటకేనా అని అనుమానం వస్తుంది. అందుకే పుట్టగతులు లేకుండా పోయిన రాజకీయ పక్షాలను చూసి నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగువారిని, తెలుగుభాషను, తెలుగు సంస్కృతిని స్మరించడం కూడా పాపం అనుకునే రాజకీయ పక్షాలు నామరూపాలు లేకుండా పోవాల్సిందే.
తమిళనాడు రాజకీయాలను ఒక్కసారి పరికించి చూడండి - మన ప్రధానమంత్రినే పొట్టన పెట్టుకున్న తమిళ పులులు చెడ్డవారు కాదని ధైర్యంగా చెప్పగలిగిన కరుణానిధి ఎలాంటివాడో చూడండి. తమిళం కోసం, తమిళుల కోసం ఆమరణ నిరాహారదీక్షకు కూడా తయారైన తమిళ ముఖ్యమంత్రి అతను. ఇది సరైనదా కాదా అన్నది పక్కన పెడితే ప్రపంచంలోని తమిళులంతా ఒక్కటే అనే భావనే పులకరింపజేస్తుంది. కరుణానిధిని చూచి జయలలిత మరింత ముందుకు వెళ్ళి తమిళులకు ప్రత్యేక దేశమే కావాలని ప్రకటించింది. అలా ప్రకటించి ఉండకపోతే ఆవిడకి ప్రస్తుతం వచ్చినన్ని సీట్లు కూడా వచ్చి ఉండేవి కాదు. తమిళనాడు రాజకీయాలలో తమిళం మీద, తమిళ సంస్కృతి మీద, తమిళుల అభ్యున్నతి గురించి ఎవరు ఎంతగా పోటీ పడతారన్నదే ముఖ్యమవుతుంది.
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|