|
|
Articles: TP Features | అను'బంధాల' రక్ష! - Site Administrator
| |
(సురేష్ జి.)
ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమను 'శ్రావణపూర్ణిమ లేక జంధ్యాల పూర్ణిమ', రాఖీ లేక రక్షాబంధన్ పండుగ అని పిలుస్తూ ఉంటారు. జంధ్యాలు ధరించే వారందరూ ఈ రోజున నూతన జంధ్యాలు ధరిస్తారు.
శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతం ధరించి విద్యార్ధులకు వేదపఠనం ప్రారంభిస్తారు. వేద పండితులు వేదాలను వల్లెవేయడం అంటే, ఆవృత్తి చెయ్యడం ఈ రోజు నుండే ప్రారంభిస్తారు. అలా వీరు ఈ రోజు వేదాలన్నింటినీ ప్రారంభ ఋక్కును, చివరి ఋక్కును పఠిస్తారు. కాలక్రమంలో ఈ రోజు 'రక్షాబంధన్ లేక రాఖీ' పండుగగా ప్రాచుర్యం పొందింది.
రక్షాబంధనాన్ని ఈ దిగువ మంత్రాన్ని పఠిస్తూ భార్య - భర్తకు, సోదరి - సోదరునికి యుద్ధానికి వెళ్ళే వీరునకు విజయప్రాప్తి కోసం రక్షాబంధనం చేస్తూ ఉంటారు.
యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబల:
తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల
శ్రీ మహావిష్ణువు శక్తిచే మహాబలుడు అయిన బలి చక్రవర్తిని బంధించినట్లుగా ఓ రక్షాబంధనమా! నీవు చలించక వీనికి రక్షణ కల్పించు అని మంత్రార్థం. ఈ - రక్షాబంధన్ ఎలా ప్రారంభమైనది అంటే... ఈ గాథ మనకు మంచి ప్రామాణికమవుతుంది.
పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కర (పన్నెండేళ్ళు) కాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటినీ కూడగట్టుకుని 'అమరావతి' లో తలదాచుకుంటాడు. అలాంటి భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగిన తరుణోపాయం కోసం ఆలోచిస్తూ ఉన్న సమయంలో రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధనం చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునిలో 'సమరోత్సాహం' పురికొల్పింది. సరిగా ఆ రోజు 'శ్రావణ పూర్ణిమ' అయినందున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన 'రక్ష'ను దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునికి కట్టి విజయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైంది.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|