|
|
Articles: TP Features | 'బ్రహ్మాండ' సంపన్నుడు - Site Administrator
| |
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలను ఇటీవల కొన్ని సంస్థలు ప్రకటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఆ జాబితాలోని ఆగ్రస్థానంలో ఉన్న వంద మంది జాబితా అని, వారిలో మళ్ళీ పది మంది అత్యంత ఉన్నత ర్యాంకుల్లో ఉన్నవారని జాబితాలు రూపొందించి వెల్లడిస్తుండడం మనకు తెలిసిందే.
అయితే, చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణంలోని ఏడుకొండలపై వెలసిన కలియుగ దైవం వేంకటేశ్వరస్వామికి సమానమైన సంపన్నుడు ఈ లోకంలోనే లేడంటే అతిశయోక్తి కాదు. స్వామికి సరితూగే దైవమూ లేదు.... ఉండబోదు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా, ఆపద మొక్కులవాడిగా వెలుగొందుతున్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల మదిలోనే కాక సంపాదనలోనూ అపర సంపన్నుడే. ఆయన ఆస్తుల విలువ సుమారుగా ఎంతో తెలుసా! లక్షా నలభై ఐదు వేల కోట్ల రూపాయల పైమాటే! దీనిలో స్వామివారి స్థిరాస్తుల విలువ లక్ష కోట్లు ఉంటే, స్వర్ణాభరణాల విలువ 45 వేల కోట్లు. ఇంకా వెలకట్టలేని ఆభరణాలు స్వామివారి బొక్కసంలో ఎన్నో ఉన్నాయి.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామికి తన కుమార్తె పద్మావతి దేవిని కన్యాదానం చేసిన సమయంలో ఆకాశరాజు ఇచ్చిన వజ్ర, రత్న ఖచిత స్వర్ణాభరణాలతో పాటు, రాజులు, చక్రవర్తులు, ప్రస్తుత పారిశ్రామికవేత్తల వరకు ఎందరో భక్తులు సమర్పించిన వజ్ర, స్వర్ణాభరణాలు దేవదేవునికి బొక్కసంలో ఉన్నాయి. అంతేకాక దేశవ్యాప్తంగా భూములు, అగ్రహారాలు, మఠాలు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు, కల్యాణ మండపాలు, ఉద్యానవనాలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబాయి, షిరిడీ, ఋషికేష్, నైనిటాల్ తో సహా తిరుమల, తిరుపతి, తిరుచానూరులలోనూ టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల ఆస్తులను వెలకట్టడం సాహసోపేతమే అవుతుంది!
| Read 2 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|