|
|
Articles: TP Features | అందరికీ అన్నదాతే లోకువ! - Site Administrator
| |
(రాణి కె.ఆర్.)
ఈ దేశంలో తమ వృత్తికి, జీవితానికి భధ్రత లేని వర్గం ఏదైనా ఉందంటే... అంది రైతు లోకమే. ఆరుగాలం శ్రమించి... అందరికీ అన్నదాతగా నిలిచే రైతులంటే అందరికీ చులకనే! కాబట్టే.... అతని చావు పట్ల ఎవరికీ జాలి కలగడం లేదు. పైగా ఎకసెక్కాలు తోడవుతున్నాయి. రైతులు మద్యానికి బానిసలై... అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూత్రీకరించారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో... తాను 'అలా అనలేదని' షరా మామూలుగానే వివరణ ఇచ్చారు. సాగు కోసం రైతులు అప్పులు చేస్తున్నారని... అప్పుల బాధతో మద్యానికి కొందరు రైతులు బానిసలు అవుతున్నారని, ఎటూ పాలుపోక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తన వ్యాఖ్యలను వివరించారు.
నిజమే! రాజగోపాల్ రెడ్డి ఎలాంటి అనుమానం లేకుండా జరుగుతున్న సంఘటనలే చెప్పారు. ఈ దేశంలో ప్రధాన వర్గమైన రైతు లోకం స్వాతంత్ర్యానికి పూర్వమే కాదు... అనంతరం కూడా నిస్సహాయంగా ఘోషిస్తున్నది... రోదిస్తోంది. చివరకు ఉరితాళ్ళను పేనుకుంటోంది. ఎందుకంటే ఆయన చెప్పిన విధంగానే సాగు కోసం అప్పులు చేయడమే!
సాగు చేయాడనికి రైతులకు చౌకగా ఋణ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వాలకు మనసొప్పదు. ఎన్డీఏ హయాం వరకూ పరిశ్రమల కన్నా వ్యవసాయ ఋణానికి బ్యాంకర్లు అధిక వడ్డీని గుంజేవారు. వానలు కురిసినా, కురవకున్నా అష్టకష్టాలు పడి పండించే పంటకు గిట్టుబాటు ధర ఉండదు. ఈ పంట పండించడానికి నకిలీ విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల కోసం రైతులు ఎంత కష్టపడతారో ఎవరికెరుక! పురుగుమందులు, ఎరువుల కోసం తుపాకీ తూటాలను ఎదుర్కోవలసిన దుర్గతి రైతుకు పట్టింది. తీరా పంటను మార్కెట్ యార్డ్ కు తీసుకుపోతే.... అమ్మబోతే అడవి! అమ్మకుండా ఉందామంటే... తెచ్చిన పెట్టుబడిని తిరిగి చెల్లించాలి కనుక అమ్మితీరాల్సిందే! నిల్వచేసే దారి కూడా లేదు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|