|
|
Articles: TP Features | నైవేద్యం లేని పూజారులు - Site Administrator
| |
(అవినాష్)
సాధారణ ఆలయంలో దేవతామూర్తిని నిరంతరం అర్చించే అర్చక స్వామి జీవితం ఎంతో ధన్యమైంది కదా అని ఏ భక్తుడైనా భావించడం సహజం. అదే మరి... అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సప్తగిరుల్లో వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో ఆయన 'పరిధి'లోని ఆలయాల్లో పూజాధికాలు చేసే అర్చకస్వాములంటే ఇక చెప్పనలవి కాదు. 'కమలాక్షునర్చించు కరములే కరములు' అన్న తీరులో అర్చకస్వామి జన్మధన్యం అనిపించక మానదు. కానీ ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు జీవితం కటిక దరిద్రంతో నిండింది. శంకరమంచి సత్యం - అమరావతి కథల్లో చెప్పినటువంటి కష్టాలే వారిని వెన్నాడుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే నగరిలోని మార్కండేయ స్వామి, బుగ్గ, కాల్వేటి నగరాల్లోని ఆలయాల్లో కొలువైన మూర్తులకు అర్చనలు చేసే పూజారుల దినసరి వేతనం ఎంతో తెలుసా... కేవలం 20 రూపాయలే! తిరుమల దేవస్థానం ఆధీనంలోని ఆలయాల్లో పనిచేసే పూజారులనగానే జీవితం నందనవనంలాగా ఉంటుందని భావించడం పొరపాటని, స్వామి వారు శ్రీమంతులే కానీ... అర్చకస్వాములు - 'దరిద్ర నారాయణులు'గానే ఉన్నారని ఒక రిటైర్డ్ అర్చకస్వామి ఆవేదన చెందారు.
ఏటా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వార్షిక ఆదాయం గల వడ్డి కాసుల వాడి సన్నిధిలో పని చేసే పూజారులు ఈతిబాధలు పడుతున్నారంటే... నమ్మడం కొంచెం కష్టమే! కాని ఇది నిజం...కొన్నేళ్ళక్రితం వరకూ అర్చకులకు ఇచ్చే నెల వేతనం 1200 రూపాయలు మాత్రమే. రెండేళ్ళక్రిందట ఈ మొత్తాన్ని 7,500 రూపాయలకు పెంచారు. పని గంటల ప్రకారం చూసినా... ఆలయంలో ఎక్కువసేపు గడిపే వీరికి చెల్లిస్తున్న మొత్తాన్ని తక్కువగానే పరిగణించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆధ్వర్యంలో నడిచే ఆలయాల్లో మొత్తం 200 మంది పూజారులు, తిరుమల ఆలయంలో 56 మంది అర్చకస్వాములు ఉన్నారు. తిరుమలలో ముగ్గురు ప్రధాన అర్చకులకు మాత్రమే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదా ఉంటుంది. వారికి కార్లలో ప్రయాణించే సౌకర్యం కూడా ఉంటుంది. మిగిలిన వారిలో 11 మంది అర్చకులు, 42 మంది సంభావన అర్చకులు ఉన్నారు.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|