|
|
Articles: TP Features | కొత్త సిఎంపై ఆచి తూచి... - Site Administrator
| |
(దుర్గం రవిందర్)
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణవార్త తెలిసిన వెంటనే కొందరు రాజకీయ వాదులు కొత్త ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావాలనే డిమాండ్ ను రకరకాల పద్ధతుల్లో వెలుబుచ్చారు. తానే ముఖ్యమంత్రి అయితే బాగుండునని కోరుకునే ఒకరిద్దరు నాయకులు మినహా దాదాపు కాంగ్రెస్ నాయకులందరూ జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కావాలన్నారు, కావాలంటున్నారు. నేదురుమల్లి జనార్ధన్ లాంటి సీనియర్ నేత కూడా జగనే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంత పట్టు సాధించారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ధోరణి ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొంత పలచన చేయడం తప్ప ఇంకేమీ కాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ లో సీనియర్లు ఇంకా ఉన్నారనుకునే ఒకరిద్దరు మినహా కాంగ్రెస్ నాయకులందరు జగన్మోహన్ రెడ్డి పేరునే సూచిస్తున్నారు.
దాదాపు 120 మంది శాసనసభ్యులు సంతకాలు చేసి రాతపూర్వకంగా తమ అంగీకారాన్ని అధిష్టానానికి తెలియపర్చారు. మంత్రులైన కొండా సురేఖ, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ముఖ్యమంత్రులైన నేదురుమల్లి, నాదెండ్ల భాస్కర్ రావు తదితరులు ఎందరో మీడియా ద్వారా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఈ విషయమై ఏకంగా ఏకగ్రీవ తీర్మానమే చేశారు. దాదాపు 30 మంది ఎం.పి.లు నేరుగా అధినేత్రి సోనియాగాంధీతోనే తదుపరి ముఖ్యమంత్రి జగన్ అయితే బాగుంటుందని చెప్పారు. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ చరిత్రలో ఏ అభ్యర్థికీ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఇంతటి మద్దతు దొరికి ఉండకపోవచ్చు. ప్రజాస్వామిక ప్రాథమిక సూత్రాల ప్రకారం 'మెజార్టి ఈజ్ లా' అనుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వం దాదాపు ఖరారు అయినట్టే!
ఇప్పుడున్న తాజా పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశమై తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రకటించడం ఒక లాంఛనం మాత్రం అవుతుంది.
| Read 1 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|