|
|
Articles: TP Features | అపురూప కవి అన్నమయ్య - Site Administrator
| |
(ఆచార్య ఆర్వీయస్ సుందరం)
ప్రాచీన కాలం నుండి ఇప్పటివరకు తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే బయటి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన రచయితలు మనకెంతమందో ఉన్నారని స్పష్టమవుతుంది. ప్రాచీనభాష అనే హోదా మనకు లభించింది కాని అది అమలులోకి రావటానికి ఇంకా ఎంతకాలం పడుతుందో తెలియదు. కానీ ఈ హోదాల విషయం ఎలా ఉన్నా తెలుగువారు ఇతరులతో తమను గురించి చెప్పుకోవాలంటే సాహిత్యానికి వివిధ శాస్త్రాలకు విశిష్టమైన కానుకలు అందించిన వారెంతమంది కనిపిస్తారు. నిజానికి అలాంటివారిని గురించే మనం బయటి ప్రపంచానికి తెలియజెప్పవలసిన అవసరం ఎంతయినా ఉంది. ముఖ్యంగా భాస్కర గణితము, ఆంధ్రశబ్ద చింతామణి, ఆంధ్ర భాషా భూషణము, విజ్ఞానేశ్వరము, సుమతీ శతకము లాంటి పుస్తకాల గురించి విచారించాల్సి ఉంటుంది. ఈ విషయం తెలిసినవారు కాబట్టే సి.పి.బ్రౌన్ లాంటి మహనీయులు వేమన గురించి, సుమతి శతకం గురించి ఇతరలకు తెలియజెప్పారు. ఈ కోవలోకి వచ్చే మహనీయుడే అన్నమయ్య.
అన్నమయ్య గురించి ఇటీవలి కాలంలో ఎన్నో రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అయినా చెయ్యవలసిన పరిశోధన, తెలుసుకోవలసిన విషయాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే అపురూపమైన కవి అన్నమయ్య. ఈ మహనీయుడి గురించి చెప్పవలసిన విషయాలు, మనం తెలుసుకోవలసిన విషయాలు, ఇతరులకు గర్వంగా చెప్పవలసిన విషయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.
ఒక మనిషి జీవితంలో ఎంత సాహిత్య కృషి చేయవచ్చో నిరూపించిన కవులు ఎంతోమంది ఉండడం తెలుగువారి అదృష్టం. షేక్ స్పియర్ గురించి చెప్పేవారు ఆయన రచనా వైశిష్ట్యం ఎన్ని రకాలుగా ఉందో వివరిస్తారు. ఆ మహారచయిత ఇరవై వేల పదాలు వాడాడని అలాంటి రచయిత 'నభూతో నభవిష్యతి' అని విమర్శకులు వేనోళ్ళ పొగిడారు. అబ్బరాజు సూర్యనారాయణ అనే మహనీయుడు పై అభిప్రాయాన్ని అబద్ధమని నిరూపించాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలు కష్టపడి తిక్కన భారతం ఒక్కొక్క పదమూ చదివి, లెక్కపెట్టి ఆ మహాకవి షేక్ స్పియర్ కంటే ఎక్కువగా 26,000 పదాలు రాశాడని నిరూపించారు. ఇది తెలుగువారికి గర్వకారణం. నిజానికి సమాసాలు విడగొట్టి పదాలుగా లెక్కపెడితే ఇంకా కొన్ని వేల పదాలు చేరుతాయి.
| Be first to comment on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|