|
|
Articles: TP Features | తెలుగువారికి మూడు రాష్ట్రాలు - Site Administrator
| |
(దుర్గం రవీందర్)
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు, లేదా మూడు రాష్ట్రాలు ఉంటే నష్టం ఏమిటి? అధికార వికేంద్రీకరణ అభివృద్ధికి సోపానంగా ఉంటుంది. లెనిన్ మొదలుకొని అంబేద్కర్, రామ్ మనోహర్ లోహియా తదితర మహానాయకులు ఎందరో ఈ విషయాన్ని సశాస్త్రీయంగా వివరించి చెప్పారు. ఆనాడు ఎన్.టి.రామారావు తాలూకా వ్యవస్థను రద్దుచేసి మండలాలను ఏర్పరచినప్పుడు అడ్డుపడినటువంటి శక్తులే నేడు చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అడ్డువుతున్నాయి. సామ్రాజ్యవాద దోపిడీ మనస్తత్వం ఉన్నవారే అధికార వికేంద్రీకరణను ఇష్టపడరు. మండల వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఎంత సౌకర్యం కలిగిందో అందరం చూస్తున్నదే. ఇలాగే చిన్న రాష్ట్రాలు కూడా సామాన్య ప్రజలకు మేలు చేస్తాయి.
అక్కడి నాయకులు ఆంధ్ర, రాయలసీమ ప్రజలను వంచించి సంపాదించిన డబ్బులు తెచ్చి హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వీరే రంగారెడ్డి, హైదరాబాద్ లతో పాటు తెలంగాణ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ప్రభుత్వంలో పరపతి ఉపయోగించి లక్షల పెట్టుబడిని కోట్లుగా మార్చుకొని రాజధానిలో స్థిరపడుతున్నారు. వీరే ఈ విభజనను అడ్డుకుంటున్నారు. 103 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేయడం వెనుక ఆంధ్ర సీమ ప్రాంతాల ప్రజల అభీష్టం కన్నా ఆ శాసనసభ్యుల ఉక్రోషం ఎక్కువ కనిపిస్తున్నది. పాపం ప్రజలకు వీరు చేస్తున్న స్వార్ధ యత్నాలు, ఆలోచనలు తెలియడం లేదు.
వద్దు మొర్రో, మీతో మేము కలిసి ఉండం అని చెబుతున్నా హైదరాబాద్ ఉండాల్సిన అవసరం వారికి ఏమిటి? ఏడాదిలో నూరు రోజులు కూడా నడవని అసెంబ్లీ కోసం వారు హైదరాబాద్ వచ్చి సొంత ఇండ్లు కట్టుకోవాల్సిన అవసరం ఏముంది. వారి వారి జిల్లా కేంద్రాలను ఎందుకు అభివృద్ధి చేసుకోరు. రాజధాని నగరంలో కోటి మంది జమ అయి రాష్ట్ర సంపదను, మానవ వరులను, పరిపాలనను ఇక్కడ కేంద్రీకరించవలసిన అవసరం ఏముంది. ఈ దృష్టితో చూస్తే తెలుగువారికి రెండు లేదా మూడు రాష్ట్రాలు, రాజధానులు ఉంటే లాభమే కాని నష్టం లేదు కదా.
పార్టీలకు సంబంధం లేకుండా 103 మంది ఆంధ్ర, రాయలసీమ శాసనసభ్యులు రాజీనామాలు చేయడం అనే చర్య వల్ల ఎవరికైనా ఏమి అవగతమౌతుంది. ప్రజల తరపున ఆ ప్రజల అభీష్టం మేరకు రాజీనామాలు చేస్తున్నామని శాసనసభ్యులు అన్నదాంట్లో నిజం ఎంత ఉందో ఎవరికి వారు యోచించాల్సిందే. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్లోర్ లీడర్స్, తెలంగాణ శాసనసభ్యులు మినహా దాదాపు ప్రధాన పార్టీల శాసనసభ్యులందరూ రాజీనామా చేశారు. కొందరు పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేశారు. ఇది నిజంగా ప్రజాభీష్టమేనా లేదా ఏర్పడబోయే కొత్త రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడానికి వేస్తున్న ఎత్తుగడనా, లేదా వారి ఆస్తులను, వ్యాపారాలను రక్షించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమా అన్నది గమనించాలి. ఇంత తీవ్ర నిర్ణయాన్ని వారు ఎందుకు తీసుకున్నట్లు.
| Read 9 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|