|
|
Articles: TP Features | ఆది కవికి వెయ్యేళ్ళు - Site Administrator
| |
(అక్కిరాజు రమాపతిరావు)
'వెయ్యేళ్ళ ఆయుష్షు' అనేది తెలుగు వారి నుడికారం. మనం ఎదురుచూస్తున్న అత్యంత ఇష్టులో, చూడాలనుకుంటున్నారో హఠాత్తుగానో, నిరీక్షించిన తర్వాతనో కనపడినప్పుడు 'వెయ్యేళ్ళాయుష్షు నీకు' అంటూ సాదరంగా స్వాగతం చెప్పడం ఆనవాయితీ మనకు.
తెలుగు కావ్యం ఆవిర్భావానికీ, తెలుగు సాహిత్యానికీ వెయ్యేళ్ళ పండుగ ఇప్పుడు మనం జరుపుకోవాలి. ఆధునిక భారతీయ భాషా సాహిత్యాలలో తెలుగుకు విశిష్ట స్థానం ఉన్నది. స్వాభిమానంతో చెప్పుకోవడం కాదు. మన దేశ భాషల వికాసం గురించి, పుట్టు పూర్వోత్తరాల గురించి అధ్యయనం చేసిన, తెలిసిన విద్వాంసులు చెప్పే మాట ఇది. ఎప్పుడో ఐదు వందల ఏళ్ళ కిందటే దాక్షిణాత్య వివిధ రాజ్య పరిపాలకులు అందరిలోనూ గొప్పవాడైన, గొప్ప కవి పండితుడైన, విశాల రాజ్యాధిపతియైన శ్రీకృష్ణ దేవరాయలు చెప్పిన మాట ఇది. ఆయన రాజ్యపరిపాలన కాలం 1509 నుంచి 1530 వరకు అని చరిత్రకారుల నిర్ణయం. ఆయన ఏమన్నాడు? 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని. సంస్కృత స్పష్టోచ్ఛారణలోనూ, వేద విద్యలోనూ మత దార్శనికులుగాను తెలుగువాళ్ళు గొప్పవాళ్ళు అని భాషా సాంస్కృతిక చరిత్రజ్ఞుల నిర్ణయం.
ఆది కవి నన్నయ్యకు ఇప్పటికి వెయ్యేళ్ళు. ఆయన తెలుగు భాష ఉన్నంత కాలం ఉంటాడు. పదేళ్ళ కిందట నూతన శతాబ్దమూ, నూతన సహస్రాబ్దమూ కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇప్పుడు తెలుగువారంతా నన్నయ్య సహస్ర జయంత్యుత్సవాలు ఆంధ్ర దేశం అంతటా జరుపుకోవాలి... తెలుగువారికి నన్నయ్య వాగమశాసనుడు. ఆదికవి. నన్నయ్యది ఋషిమార్గమని వేటూరి ప్రభాకర శాస్త్రి అన్నారు. నన్నయ్య రెండవ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ. అంత మనోజ్ఞంగా కావ్య రచన చేసిన ఇంకొక కవి ఈ వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలోనే కనపడరని కవిత్వ తత్త్వవేత్తల తీర్పు. 'నన్నయ్య తిక్కనల పద్యరచన తీరుతెన్నులు' అనే వ్యాసంలో నన్నయ్య రచన వెన్నెల అనీ ఆయన వచనం కూడా పద్యంలాగా ఉంటుందనీ మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి భాష్యీకరించారు.
| Read 3 Comment(s) posted so far on this Article!
| |
|
|
|
|
Advertisements |
|
|
|
Advertisements |
|