నర్సాపురం : నర్సాపురం నుంచి విశాఖపట్నం వెళ్ళాల్సిన సింహాద్రి ఎక్స్ ప్రెస్ బుధవారం ఉదయం పట్టాలు తప్పింది. ఎక్స్ ప్రెస్ నర్సాపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే వెనుక బోగీ పట్టాలు తప్పింది. దీనితో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి పెను ప్రమాదం జరగకుండా నివారించాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే నర్సాపురం స్టేషన్ నుంచి రైల్వే సిబ్బింది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన బోగీని మిగతా రైలు నుంచి వేరుచేశారు. అనంతరం సింహాద్రి ఎక్స్ ప్రెస్ విశాఖపట్నం వైపు సాగిపోయింది.