కాపీ కొట్టిన హెచ్ఎంలు
కాకినాడ : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపధ్యాయులే పరీక్ష రాస్తూ కాపీ కొట్టి పట్టుబడ్డారు. నగరంలోని పి ఆర్ బాలబాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపధ్యాయులకు అకౌంట్ టెస్ట్ ను నిర్వహించారు. ఈ పరీక్షకు 486 మంది హాజరు కావాల్సి ఉండగా, 435 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో 8 మంది స్లిప్ లతో కాపీ కొడుతూ పట్టుబడ్డారు. వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.
News Posted: 12 January, 2010
|