నెల్లూరు : ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రూటు మార్చారు. నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించాల్సి ఉండగా చివర క్షణంలో ఆయన టూరు రద్దు అయింది. విజయవాడ నుండి ప్రత్యేక వాహనంలో చిరంజీవి నెల్లూరుకు వస్తున్నట్లు స్థానిక నేతలకు సమాచారం అందింది. దీంతో పార్టీ శ్రేణులన్నీ ఆయన రాక కోసం సన్నాహాలు చేసారు. అయితే చిరంజీవి చివరలో నెల్లూరు పర్యటన రద్దు చేసుకుని తిరుపతికి పయనమయ్యారు.