'న్యాయ విచారణ జరపాలి'
కాకినాడ : కల్తీ సారా ఘటనపై న్యాయ విచారణ జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎత్తివేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీసారా బాధితులను ఆయన గురువారం ఉదయం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం బాబు కోరమండల్ గ్యాస్ లీకేజీ బాధితులను కూడా పరామర్శ జరిపారు. ఈ ఘటనలో బాధితులను ప్రభుత్వం, యాజమాన్యం అన్ని విధాల ఆదుకోవాలని చంద్రబాబు కోరారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన విశాఖ జిల్లా పయనమయ్యారు. అక్కడ పుట్టి మునిగిన ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
News Posted: 3 February, 2010
|