'17న తాడిపత్రి దిగ్బంధన'
హైదారాబాద్ : కార్మికులకు మద్దతుగా ఈ నెల 17న సిపిఐ ఆధ్వర్యంలో తాడిపత్రిని దిగ్బంధనం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులపై అక్రమ కేసులు బనాయించిన మాజీ మంత్రి జేసీ దివాకరె రెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేసారు.
ఆదిత్య బిర్లా గ్రూపునకు జేసీ ఊడిగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు విచారకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం కనుగొనాలన్నారు. ముస్లీం రిజర్వేషన్ లకు బిజేపీ మతం రంగు పులిమిందని నారాయణ అన్నారు.
News Posted: 8 February, 2010
|