'వచ్చే ఏడాది తెలంగాణలో హోలీ'
కరీంనగర్ : వచ్చే ఏడాది హోలీ పండగను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటామని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి బొత్స సత్యన్నారాయణ వ్యాఖ్యలకు సీమాంధ్ర నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారో చెప్పాలన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలకు కనువిప్పు కలగాలని ఆయన అన్నారు.
News Posted: 1 March, 2010
|