'మళ్లీ గెలుస్తా'
హైదరాబాద్ : ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తాను మళ్లీ గెలుస్తానని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ నారాయణ ధీమా వ్యక్తం చేసారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు డీ శ్రీనివాస్ పైనా, లేదంటే ఆయన కుమారుడుపైన కూడా గెలుపొందుతానని చెప్పారు. ప్రత్యర్థులు ఎవరైనా వారిపై సునాయాసంగా విజయం సాధిస్తానని లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణకు మద్దతుగా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
News Posted: 1 March, 2010
|