ఎమ్మెల్సీగా ఐలాపురం ఎన్నిక
విజయవాడ ః జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఐలాపురం వెంకయ్య గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన తన సమీప ప్రత్యర్థి గుత్తా శివరామకృష్ణపై ఆయన 181 వోట్ల తేడాతో విజయబావుటా ఎగరేశారు. సోమవారం జరిగిన వోట్ల లెక్కింపు పూర్తయింది. మూడు రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం 11 వందల మంది వోటర్లు మాత్రమే తమ వోటు హక్కు వినియోగించుకోవడంతో వోట్ల లెక్కింపు ప్రక్రియ రెండు గంటల్లోనే పూర్తయి, ఫలితం తెలిసిపోయింది.
News Posted: 9 February, 2009
|