బాపట్ల: మున్సిపల్ చైర్ పర్సన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత మహిళ మేకల ఎలీశమ్మ ఎన్నికయ్యారు. 32వ వార్డుకు చెందిన ఎలీశమ్మ అత్యధిక మెజార్టీ తో చైర్ పర్సన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో ఐ.వెంకటేశ్వరెడ్డి ప్రకటించారు. మున్సిపల్ కౌన్సిల్ హాలులో మంగళవారం ఉదయం నిర్వహించిన ఛైర్ పర్సన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎలీశమ్మకు 23 ఓట్లు రాగా టిడిపి అభ్యర్థి వేమవరపు విజయ్ కుమార్ కు నాలుగు ఓట్లు వచ్చాయి.