బస్సు బోల్తా: ఒకరి మృతి
గుంటూరు : జిల్లాలోని చిలకలూరిపేట మండలంలో ఆర్టీసీ బస్సు కాల్వలోకి బోల్తా పడిన ప్రమాదంలో ఒక ప్రయాణికుడు మరణించారు. మరో 39 మంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. కోటప్పకొండ తిరునాళ్ళను పురస్కరించుకొని ప్రత్యేక సర్వీసుగా విజయవాడ గవర్నర్ పేట డిపోకు చెందిన బస్సు తిరుగుతోంది. కోటప్పకొండ నుంచి చిలకలూరిపేట వెళుతుండగా రహదారి పక్కనే ఉన్న కాల్వలోకి బోల్తాకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 125 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారంతా గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందినవారు.
News Posted: 24 February, 2009
|