గుంటూరు : ప్రభుత్వం తమకు ఇళ్ళు కేటాయించాలంటూ వికలాంగులు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ సృష్టించిన సంఘటన జిల్లాలోని బాపట్లలో చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా ప్రదేశానికి వచ్చి వారి డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు. దీనితో వికలాంగులు సెల్ టవర్ పై నుంచి కిందికి దిగారు. దీనితో అప్పటి వరకూ సెల్ టవర్ ఉన్న ప్రాంతంలో తీవ్ర ఆందోళనతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.