చిత్తూరు : జిల్లా కోర్టులో బాంబు పెట్టినట్లు గురువారం ఉదయం వచ్చిన బెదరింపు కాల్ స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. కోర్టు భవనంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులకు వెంటనే ఈ సమాచారాన్ని కోర్టు అధికారులు అందించారు. దీనితో పోలీసులు బాంబు స్వ్కాడ్ తో హుటాహుటిన చేరుకొని అణువణువూ గాలిస్తున్నారు.