అనంతపురం: ప్రేమించిన వ్యక్తే ఆమె పాలిట కీచకుడిలా మారాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ ప్రేమికుడు బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా తన స్నేహితుడ్ని కూడా అరాచకానికి పురికొల్పాడు. ఇద్దరూ ఆ బాలికపై అత్యాచారం చేశారు. ఈ ఉదంతం అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. జరిగిన ఘోరాన్ని ఆ బాలిక తల్లి తండ్రులకు వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.