తిరుమలలో మహిళ హత్య
తిరుమల : పుణ్యక్షేత్రమైన తిరుమలలో రోజు రోజుకూ అవాంఛనీయ సంఘటనలు పెరుగుతున్నాయి. శ్రీవారి దర్శనం పేరుతో గరుడాద్రి కాటేజ్ లోని గదిని బుక్ చేసుకున్న వ్యక్తి హత్యకు తెగబడ్డాడు. అతనితోపాటు వచ్చిన మహిళ గదిలో హత్యకు గురైంది. ఈ ఉదంతం శుక్రవారం బయటపడింది. బెంగుళూరుకు చెందిన వ్యక్తి రమేష్ బాబు పేరుతో ఈ గదిని తీసుకున్నట్లు తెలిసింది. తిరుమల పోలీసులు కేసును విచారిస్తున్నారు. వారు జంటగా వచ్చారా, ఏ సమయంలో వచ్చారు, రమేష్ బాబు రూపురేఖల వివరాలను కాటేజ్ నిర్వహకల నుంచి అడిగితెలుసుకున్నారు.
News Posted: 27 February, 2009
|