పరిపాలన భవనం వద్ద తోపులాట
తిరుపతి : టిటిడి చైర్మన్ డి.కె.ఆదికేశవులు నాయుడి తీరుకు తిరుమలలో నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. సోమవారం ఉదయం వారంతా టిటిడి పరిపాలనా భవనాన్ని ముట్టడించేందుకు యత్నించారు. భవనం గేట్లు తొలగించి లోనికి చొచ్చుకు వెళ్ళేందుకు వారు ప్రయత్నించారు. ఆందోళకారుల ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. దీనితో టిటిడి పరిపాలన భవనం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిటిడి చైర్మన్ ఆదికేశవులు నాయుడు దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారని, తమ సమస్యలు పరిష్కరించాలంటూ వారు చుట్టుముట్టారు.
News Posted: 2 March, 2009
|