లారీ, ఆటో ఢీ: 8 మంది మృతి
చిత్తూరు : పలమనేరు వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడమే మరణించారు. ఓకంటైనర్ లారీ అదుపు తప్పి ఆటోపైకి దూసుకుపోవడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. పి.ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులు చికిత్స నిమిత్తం ఆటోలో వస్తుండగా పలమనేరు వస్తున్న కంటైనర్ లారీ చెక్ పోస్ట్ వద్ద అదుపు తప్పి ఆటో పైకి దూసుకుని వెళ్ళింది. దీంతో ఆటో డ్రైవర్ తో సహా 8 మంది మరణించారు. మరణించినవారిలో ముగ్గరు పురుషులు, ఐదుగురు స్త్రీలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News Posted: 3 March, 2009
|