టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విజయవాడ : ఈనెల 23 నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనుండడంతో అధికారులు పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షా కేంద్రాలను మూడు కేటగిరీలుగా నిర్వహించి, అధికారులను భారీ సంఖ్యలో నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రానికీ ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, ఒక్కొక్క డిపార్టుమెంట్ అధికారిని, సూపర్ వైజర్ ని కూడా ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేశారు. సోమవారం నుండి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా కేంద్రాల్లో సౌకర్యాలపై దృష్టి సారించారు. పరీక్షలు జరిగే అన్ని పరీక్షా కేంద్రాల పాఠశాలల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు తరగతలు నిర్వహించున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా కల్పించాలని డీఈఓ ఆదేశించారు.
News Posted: 21 March, 2009
|