శ్రీవారికి కోయిల్ తిరుమంజనం
తిరుపతి : తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మంగళవారంనాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నారు. దీనితో స్వామివారికి నిర్వహించే ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసినట్లు ఆలయం అధికారులు వెల్లడించారు. తిరుమంజన కార్యక్రమం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భక్తులను స్వామివారి సర్వదర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం సందర్భంగా స్వామివారి మహాద్వారం (ప్రధాన ద్వారం) నుంచి ఆలయం అంతటా సుగంధ ద్రవ్యాలు కలిపిన మంచినీటితో శుద్ధి చేస్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది మరో మూడు రోజుల్లో వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయాన్ని సుగంధ లేపనాలతో శుభ్రపరుస్తున్నారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సంవత్సరానికి నాలుగు సార్లు తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాదికి, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ముందు తిరుమంజనం నిర్వహిస్తుండడం ఆనవాయితీ.
News Posted: 24 March, 2009
|