సహస్ర లింగాల ప్రతిష్ఠ
విజయవాడ : పటమట దత్తపీఠంలో శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో గంగాధరేశ్వర స్పటిక శివలింగానికి విశేష అభిషేక, అర్చనలు, తదితర పూజా కార్యక్రమాలు అత్యంత వైభంగా జరిగాయి. ఆశ్రమంలోని శివాలయం ముందు పుట్టమన్నుతో సహస్ర లింగాలను ప్రతిష్ఠచేసి, వేదమంత్రాలతో లింగార్చన చేశారు. స్వామీజీ కలశ ప్రతిష్ఠ చేసి ఆ కలశాలలోని జలంతో విశేష అర్చనలు నిర్వహించారు. శ్రీ మకరత రాజరాజేశ్వరి ఆలయంలో శ్రీ చక్రార్చన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శివలింగ ప్రతిష్ఠ రోజున కుంభాభిషేకం చూస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో మండలోత్సవ శివాభిషేకం చూసినా అంతే ప్రతిఫలం ఉంటుందని పేర్కొన్నారు. తదుపరి యాగశాలలో జరిగిన రుద్రహోమానికి పూర్ణాహుతి చేసి, కలశ ఉద్వాసన చేసారు. భక్తులు స్పటిక శివలింగానికి అభిషేకం చేసి స్వామీజీ చేతులు మీదుగా ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం లక్షబిల్వార్చన, దివ్య నామ సంకీర్తన తదితర కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధ సభ నిర్వాహకులు పాల్గొన్నారు.
News Posted: 25 March, 2009
|