అనంతపురం : టిక్కెట్ లభించిన వారి ఆగడాలు సర్వసాధారణం. అయినా అనంతపురం ప్రజారాజ్యంలో పార్టీలో టిక్కెట్లు రానివారి ఆగ్రహం శృతిమించుతోంది. కార్యకర్తలు రెండు రోజుల క్రితం అనంతపురంలో అభ్యర్థిపై బాంబు దాడి జరపగా నేడు పెనుగొండలో ప్రజారాజ్యం అభ్యర్థి రమేష్ బాబుకు టిక్కెట్ లభించడంతో కార్యకర్తలు దాడి చేశారు. భయాందోళనలకు గురైన రమేష్ బాబు నీటి పారుదల శాఖ గెస్ట్ హౌస్ కు వెళ్ళి దాక్కున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.