ప్రజల ప్రశంసలు
(వేముల సదానందం)
వరంగల్ : జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడంతో యంత్రాంగానికి ప్రజల వద్ద నుండి ప్రశంసలు లభించాయని కలెక్టర్ డా.బి.జనార్థన్ రెడ్డి తెలిపారు. నామినేషన్ల సందర్బంగా సజనసమీకరణ, ఊరేగింపులు, సభలు, సమావేశాలపై విధింమచిన ఆంక్షల వల్ల ఏవిధమైన హంగూ ఆర్భాటాలూ లేకుండా ప్రశాంతంగా, సాఫీగా నామినేష్ల ప్రక్రియను విజయవంతంగా నిర్వించామని జిల్లా ఎన్నికల అధికారి డా.బి.జనార్థన్ రెడ్డి పరిశీలకులకు వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయడంలో ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవడంతోపాటు ప్రజల వద్ద నుండి యంత్రాంగానికి ప్రశంసలు లభించాయని కలెక్టర్ తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు గతంలో ఉండి పోగొట్టుకున్న ఓటర్లకు ఎన్నికల గుర్తింపు కార్డు జారీ చేయడానికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ప్రత్యేకంగా ఫోటో కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. టోల్ ఫ్రీ నెం: 1100 కు వచ్చిన 38 ఫిర్యాదులలో 34 ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు.
News Posted: 2 April, 2009
|