టిడిపిలో మారిన అభ్యర్థి
తిరుపతి : తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తాజాగా లోక్ సభ అభ్యర్థిని మార్చింది. జ్యోత్స్న స్థానంలో వర్ల రామయ్యను లోక్ సభ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రాజకీయ నేపథ్యంలేని జ్యోత్స్న అభ్యర్థిత్వం పట్ల స్థానిక నేతల నుంచి వస్తున్న ఒత్తిళ్ళ కారణంగా గతంలో నియమించిన జ్యోత్స్న అభ్యర్థిత్వాన్ని అధిష్ఠానం పున: పరిశీలించింది. మొదట కొలకలూరి ఇనాక పేరు ప్రచారం జరిగినా, అనేక కసరత్తుల అనంతరం వర్ల రామయ్య పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. మరో వైపు గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ స్థానంలో టి.శ్రవణ్ కుమార్ ను బరిలో నిలిపింది.
News Posted: 3 April, 2009
|